- నిలువుదోపిడీ చేస్తున్న దళారులు
- అవసరాలు.. అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ..
- పట్టణంలోనే 19 మంది బాధితులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘మీకు అప్పు కావాలా..?, మేమడిగిన డాక్యుమెంట్లు చూపండి’ అంటూ పేపర్లలో ప్రకటన లు ఇస్తారు.. ఎవరో కొందరు అమాయకులు ఆ వలలో చిక్కగానే సర్వీస్ చారీ్జలు, డాక్యుమెంట్ చార్జీల పేరుతో కొంత డబ్బు మా బ్యాంకు అకౌంట్లో వేయండని వారిని బుట్టలో పడేస్తారు. ఇంకేముంది ఆ మాయగాళ్లు మళ్లీ కనబడితే ఒట్టు.. ఇలా ఎందరో అమాయకులు బలైపోతున్నారు. మోసపోయి చెప్పుకునే వారు అందులో కొంతమందే... వ్యక్తిగత, ల్యాండ్ మార్టిగేషన్, వ్యాపార రుణాలిస్తామని కొంద రు వ్యక్తులు పలు పత్రికల్లో ప్రకటన లు జారీ చేస్తున్నారు. వీటిని పరిశీ లించిన స్థానికులు మొబైల్ ఫోన్ ద్వారా వారిని సంప్రదిస్తున్నారు.
ముందుగా ఏ రుణం కావాలి..?, ఏం చేస్తారు..?, ఎంత కావాలి? అనే వాటి వివరాలు సేకరిస్తారు. ‘అందుకు మీ ఐడీకార్డు, బ్యాంక్ పాస్బుక్, కరెంట్ బిల్లులను మెయిల్ చేయాలని వారికి సూచి స్తారు. అనంతరం మీ డాక్యుమెంట్లు చూశాం.. రుణం మంజూరు చేస్తాం అందుకోసం మీకు ఇచ్చే రుణంలో 50 శాతం కమీషన్ చెల్లిం చాల్సి ఉంటుంది’ అని నిర్వాహకులు అర్జీదారులకు తెలుపుతారు. వాటితో పాటు డాక్యుమెంట్ చార్జి రూ.2,350, జనరల్ ఇన్సూరెన్స్, ప్రాజెక్టు రిపోర్టు తయా రు చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాలంటారు. వాటిని శ్రీ దత్తసాయి ఎంటర్ప్రైజెస్ ఖాతా లో జమచేయాలని తర్వాత రెండు రోజుల్లో రుణం మంజూరవుతుందని తెలియజేస్తారు.
కానీ వారమైనా నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారం రాదు. ‘అర్జీదారులు ఫోన్చేస్తే మీకు అర్జెంటుగా రుణం కావాలంటే అదనంగా 2 శాతం కమీషన్ చెల్లించాలి. అలా అయితే వెంటనే చెక్కు జారీ చేస్తాం’ అని చెబుతారు. అసలు డాక్యుమెంట్లు పరిశీలించి వారం రోజుల్లో రుణం అందజేస్తామంటారు. వారు నెలరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫోన్చేస్తే మరికొంత కమీషన్ చెల్లించాలంటూ అడుగుతున్నారని బాధితులు తెలిపారు. ఇలా పట్టణంలోనే 19 మంది తమ అవసరాల కోసం దరఖాస్తు చేసుకొని ఆ సంస్థ పేరున రూ.19,600 చొప్పున రూ.3,72,400 ను 863720110000472 ఖాతాలో జమచేశారు.
మోసపోయా: శ్యాముల్ రాజు
పత్రికల్లో రుణం ఇస్తామనే ప్రకటనలు చూసి ఆ సంస్థను సంప్రదించా. నేను రూ.19,600 చెల్లించాను..
రుణాల పేరుతో ఘరానా మోసం!
Published Thu, Mar 5 2015 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement