భువనగిరిటౌన్ : మున్సిపల్ ఆస్తిపన్నును ఆన్లైన్ ద్వారా స్పాట్బిల్లింగ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో దీనిని ప్రారంభించారు. జిల్లాలో 5మున్సిపాలిటీలు 2నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో భువనగిరి పట్టణంలోని 30వార్డుల్లో ప్రధాన పన్నుల వసూలు కోసం 11స్పాట్ బిల్లింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి మిషన్లో 30వార్డులకు సంబంధించి బిల్లింగ్ చేసే అవకాశం ఉంది. పన్ను పెండింగ్ వివరాలను ప్రజలకు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపడంతో పాటు బిల్లు చెల్లించగానే సంబంధిత రికార్డులో నమోదు చేయడమే కాకుండా వినియోగదారునికి ధన్యవాదాలు ప్రకటిస్తూ సమాచారం అందుతుంది. భువనగిరి మున్సిపాలిటీలో ఈ నెల 16 నుంచి ఆస్తిపన్నును స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా చెల్లిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నీటి పన్నును కూడా స్పాట్ బిల్లింగ్ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీలో ఈ విధానం అమలు చేయగా.. ఇప్పుడు భువనగిరిలో అమలు చేస్తున్నారు. త్వరలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రవేశపెట్టనున్నారు.
13వేలు ఇళ్లు..7,200 నల్లా కనెక్షన్లు
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 13వేల ఇళ్లకు సంబంధించిన ఆస్తి పన్ను వివరాలను సాఫ్ట్వేర్లో పొందుపరిచారు. వీటితో పాటు పట్టణంలో ఉన్న 7,200 నల్లాల కనెక్షన్ల పన్ను వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. చెక్కు, నగదు, డీడీ ద్వారా కూడా బిల్లులను స్వీకరిస్తారు. బిల్లు చెల్లించగానే సమాచారం సర్వర్ ద్వారా పొందుపరిచే అవకాశం ఉంది.
బిల్ కలెక్టర్లపై నిఘా
జీపీఎస్, జీపీఆర్ఎస్ సిస్టంను సమన్వయం చేయడంతో ఇకనుంచి బిల్ కలెక్టర్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే సమాచారం కూడా ఉన్నతాధికారులుకు అందుతుంది. దీంతో బిల్ కలెక్టర్లు విధులను సక్రమంగా నిర్వహించే అవకాశం ఉంది. రశీదులు ఇచ్చి పన్ను వసూలు చేసే విధానం ఇక ఉండదు.
రూపకల్పన చేసినవారు
స్పాట్ బిల్లింగ్ మిషన్ ద్వారా పన్నులు వసూలు చేసే విధానాన్ని మున్సిపల్ డీఎం జనార్దన్రెడ్డి, ఆర్డీ సత్యనారాయణతో పాటు ఎంఆర్ కమ్యూనికేషన్ ఆండ్ ఈఆర్పీ డెరైక్టర్ రాజశేఖర్ రూపకల్పన చేశారు. ఇప్పటికే మిషన్ ఉపయోగించే వారికి శిక్షణ ఇచ్చారు.
బిల్లింగ్ ‘స్పాట్’
Published Wed, Jun 18 2014 2:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement