తెలంగాణ అభివృద్ధి కోసం ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి | MP Ponguleti appeal for Telangana development | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధి కోసం ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి

Apr 1 2015 1:33 PM | Updated on Aug 21 2018 5:36 PM

పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి రాష్ట్ర అభివృద్ధికి పలు విజ్ఞప్తులు చేశారు.

ఖమ్మం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పలు విజ్ఞప్తులు చేశారు. భద్రాచలంలో గోదావరి రెండవ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రిని పొంగులేటి కలిశారు. సత్తుపల్లి-కొత్తగూడెం మధ్య నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని కోరారు. సూర్యాపేట-దేవరపల్లి నాలుగు లైన్ల రోడ్డుని జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గిరిజన విశ్వవిద్యాలయం, కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శ్రీనివాస రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ  ఒడిశా ద్వారా తెలంగాణకు సీపోర్టు నిర్మాణం చేయడానికి మంత్రి గడ్కరీ అంగీకరించినట్లు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement