దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో..

Minister KTR Says Rs 5 Lakhs Insurance Scheme To Formers - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా.. తెలంగాణలో రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవాం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకం కింద సిరిసిల్ల జిల్లాలో రూ. 100 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే యాసంగికి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి రైతులకు రూ. 5లక్షల భీమా పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top