బుల్లెట్‌పై జీవిత ప్రయాణం 

Man Making Recipies On Bullet Bike In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నగరానికి చెందిన వినయ్‌ హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందాడు. అనంతరం ఉద్యోగం కాకుండా వినూత్న ఆలోచనతో స్వయం ఉపాధి పొందుతున్నాడు. బుల్లెట్‌ బైక్‌పై పొయ్యిని అమర్చి దానిపై చికెన్‌టిక్కా, లెగ్‌పీస్, బ్రేరీబ్రేరి స్టిప్స్, గ్రీల్‌ పైనాపిల్, క్రిస్పీకార్న్, చికెన్‌కాసాడీయా వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నాడు. ఈ వంటకాలు రూ.30 నుంచి 90 వరకు లభిస్తాయని వినయ్‌ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మ గుట్టపై తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. బుల్లెట్‌ బైక్‌ను తన జీవనాధారంగా మార్చుకొని, పసందైన వంటకాలను అందిస్తు ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. (బుల్లితెర ‘గుండన్న’ మనోడే)  
 –సాక్షి ఫొటోగ్రాఫర్‌–నిజామాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top