ఉరేసుకుని  వ్యక్తి ఆత్మహత్య 

Man Hanged To Death Due To Health Problems - Sakshi

తెలకపల్లి (నాగర్‌కర్నూల్‌) : మండల పరిధిలోని గడ్డంపల్లికి చెందిన ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి (42) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యేవాడు. ఇటీవలే సమస్య అధికం కావడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్క డికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రజిత, కుమారుడు, కూతురు ఉన్నా రు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విజయభాస్కర్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top