22-ఏ భూములపై సీఎం రేవంత్ సమీక్ష | CM Revanth Reddy Holds High Level Review Meeting on Section 22A | Sakshi
Sakshi News home page

22-ఏ భూములపై సీఎం రేవంత్ సమీక్ష

Aug 18 2026 9:34 PM | Updated on Aug 18 2026 9:40 PM

CM Revanth Reddy Holds High Level Review Meeting on Section 22A

హైదరాబాద్‌: ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 22-ఏ జాబితాలో ఉన్న ప్రైవేటు భూములను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. స్లాట్ తీసుకున్న వారి భూములను 2 రోజుల్లో పరిశీలిస్తామన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 18వ తేదీ) 22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22-ఏ జాబితాలో ఉన్నది ప్రైవేటు భూమి అని తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు, ఈ మేరకు  కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. 

‘జిల్లాల వారీగా 22-ఏ భూములపై సమగ్ర పరిశీలన చేయాలి. తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలి. శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికీ ఇబ్బంది రానివ్వం. భూ హక్కులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22-ఏ సమస్యల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించొద్దు. పుకార్లు, కట్టుకథలను నమ్మకండి. ఆస్తుల హక్కుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని స్సష్టం చేశారు.
 

..

..


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement