సెట్విన్ బస్సు కింద పడ్డ ద్విచక్రవాహనదారుడు | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

సెట్విన్ బస్సు కింద పడ్డ ద్విచక్రవాహనదారుడు

Jun 26 2015 5:46 PM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదవశాత్తూ సెట్విన్ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు.

హైదరాబాద్ : ప్రమాదవశాత్తూ సెట్విన్ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి బోరబండ వైపు వెళ్తున్న సెట్విన్ బస్సు ఎర్రమంజిల్ వద్దకు రాగానే.. అటువైపే బైక్ మీద కాస్త ముందు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు.

ద్విచక్రవాహనానికి, బస్సుకి మధ్య దూరం ఎక్కువగా లేకపోవటంతో బస్సు అతని మీదకెక్కింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే  మరణించాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement