వీడిన హత్యకేసు మిస్టరీ
* కుటుంబ తగాదాలే కారణం
* బంధువును పురమాయించి మట్టుబెట్టించిన వైనం
* నిందితుల అరెస్ట్, రిమాండ్
నకిరేకల్: నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటుచేసుకున్న వెల్లెంల భిక్షమయ్య (60) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడే సూత్రధారిగా వ్యవహరించి మామను హత్య చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనివాసరావు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కారణాలు, హత్య జరి గిన తీరుతెన్నును వివరించారు.
కడపర్తి గ్రామానికి చెందిన వెల్లెంల భిక్షమయ్యకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు గతంలోనే చనిపోయాడు. పెద్దకూతురు రజితను 2006లో తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రా మానికి చెందిన సువాల శ్రీనయ్యకు ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కొద్ది రోజులకే వారి ని ఇళ్లరికం తీసుకువచ్చాడు. తదనంతరం జరి గిన పరిణామాల నేపథ్యంలో శ్రీనయ్య భార్య ను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీంతో అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. శ్రీనయ్యపై పెట్టిన వరకట్నం కేసులు కోర్టులో ఇప్పటికీ సాగుతున్నాయి. శ్రీన య్య ప్రస్తుతం జైళ్లోనే ఉన్నాడు.
జైళ్లో నుంచే హత్యకు పన్నాగం..!
తనను కటకటాల పాల్జేసిన మామ భిక్షమయ్యపై అల్లుడు శ్రీనయ్య కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని జైళ్లో నుంచే హత్యకు పన్నాగం పన్నాడు. ఇందుకు తన సమీ ప బంధువైన నల్లగొండ మండలం అక్కలయిగూడేనికి చెందిన మేడిపల్లి వెంకన్నను ఎంచుకున్నాడు. భిక్షమయ్యను హత్య చేయాలని పురమాయించాడు. ఇందుకు వెంకన్న, తన స్నేహితులైన కనగల్ మండలం జీ.చెన్నారం గ్రామానికి చెందిన ఆంజనేయులు, నల్లగొండలోని బొట్టుగూడకు చెందిన పర్వేజ్ను ఆశ్రయించా డు. ముగ్గురు కలిసి ఈ నెల 8వ తేదీన పల్సర్బైక్పై వచ్చి వ్యవసాయ క్షేత్రంలో నిద్రపోతున్న భిక్షమయ్యను కర్రలతో మోది హత్య చేశారు.
బైక్నంబర్ ఆధారంగా..
భిక్షమయ్యను హత్య చేసిన నిందితులు పల్సర్బైక్పై పారిపోతుండగా కడపర్తి గ్రామస్తులు గమనించారు. ఆ వాహనం నంబర్ను పోలీసులకు తెలపగా దాని ఆధారంగా నిందితులను గుర్తించినట్టు సీఐ వివరించారు. ముగ్గురు నిందితులను వారి స్వగ్రామాల్లోనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ ప్రసాదరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.
అల్లుడే సూత్రధారి..!
Published Thu, Dec 25 2014 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement