
సాక్షి, న్యూఢిల్లీ: హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్రెడ్డి శనివారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమా నికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ హాజ రై కిషన్రెడ్డికి అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎంపీ అరవింద్, బీజేపీ నేతలు డీకే అరుణ, విష్ణు వర్ధన్రెడ్డి తదితరులు హాజరై కిషన్రెడ్డికి శుభా కాంక్షలు తెలిపారు. కిషన్రెడ్డి సతీమణి, కొడుకు, కుమార్తె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్షాను కలిసి కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.