కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్‌ | Kcr fires on Central Government | Sakshi
Sakshi News home page

కేంద్రం తన పరువు తానే తీసుకుంది: కేసీఆర్‌

May 18 2020 8:45 PM | Updated on May 18 2020 8:55 PM

Kcr fires on Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుర్మార్గమైన విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు 20 కోట్ల రుణ పరిమితి పెంచి, దరిద్రంగా ఆంక్షలు పెట్టింది. కేంద్రం తన పరువు తానే తీసుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాలపై ఈ విధంగా పెత్తనం చేయడం దుర్మార్గం అని నిప్పులు చెరిగారు. (తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌)


‘కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల.. వందశాతం బోగస్‌. నియంతృత్వ ధోరణిలో కేంద్రం వైఖరి ఉంది. రాష్ట్రాలకు నగదు ఇవ్వాలని కోరితే.. రాష్ట్రాలను భిక్షగాళ్లుగా చూసింది. ఇదేనా కేంద్రం చూసే పద్ధతి?’ అని  కేంద్ర ప్రభుత్వ తీరుపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(ఆటో, టాక్సీలకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌)

Advertisement
 
Advertisement
Advertisement