'4 సార్లు రూటు మార్చిన కేసీఆర్' | KCR changes his route 4 times to go chamber at secretariat | Sakshi
Sakshi News home page

'4 సార్లు రూటు మార్చిన కేసీఆర్'

Feb 3 2015 6:13 PM | Updated on Aug 15 2018 9:27 PM

'4 సార్లు రూటు మార్చిన కేసీఆర్' - Sakshi

'4 సార్లు రూటు మార్చిన కేసీఆర్'

సచివాలయంలో తన చాంబర్కు వెళ్లడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ 4 సార్లు రూటు మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

హైదరాబాద్: సచివాలయంలో తన చాంబర్కు వెళ్లడానికే తెలంగాణ సీఎం కేసీఆర్ 4 సార్లు రూటు మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేసీఆర్ను భయంకరమైన అభద్రతాభావం వెన్నాడుతోందని పొన్నాల వ్యాఖ్యానించారు. తప్పులు ఎత్తిచూపుతున్న తనవల్ల, ప్రతిపక్షాల వల్లే కేసీఆర్కు అభద్రతాభావం వెన్నాడుతోందని అన్నారు.

కేసీఆర్ది అహంకార పాలన అంటూ పొన్నాల ధ్వజమెత్తారు. వాస్తుదోషం, వ్యక్తిగత మొక్కులకు ప్రజాధనం ఖర్చుచేయడం సరికాదన్నారు. మూఢనమ్మకాల ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్ణయాలను, విధానాలను కోర్టులే తప్పుపడుతున్నాయని పొన్నాల చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement