భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం | indrakaran reddy visits krishna pushkaraghats | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

Aug 16 2016 1:52 AM | Updated on Sep 4 2017 9:24 AM

భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పుష్కరఘాట్లను సందర్శించిన ముగ్గురు మంత్రులు

 

పెబ్బేరు/కొల్లాపూర్: కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపుర్‌ఘాట్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలసి సందర్శించారు.

ఈ సందర్భంగా వారు పుష్కర జలాన్ని తలపై పోసుకుని కృష్ణమ్మకు నమస్కరించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పుష్కరాలు విజయవంతం చేసేందుకు ఏడు నెలల ముందే సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఘాట్లను ఎప్పటికప్పుడు సందర్శించి భక్తులతో నేరుగా సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ఎక్కడా అసౌకర్యాల ప్రస్తావనే లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement