పాలమూరు జిల్లాలో దారుణం | Husband Allegedly Slits Wife,daughter's Throat In Their home at Mahabubnagar district | Sakshi
Sakshi News home page

పాలమూరు జిల్లాలో దారుణం

May 27 2014 8:51 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం చెటాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది.

మహబూబ్నగర్ జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం చెటాన్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, కుమార్తె గొంతు కోసాడో కసాయి భర్త. ఆ ఘటనలో భార్య, కమార్తె రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో పడి ఉన్నవారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.

 

అయితే మార్గమధ్యంలోనే భార్య మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనుమానంతోనే భార్య, కుమార్తెపై భర్త దాడి చేశాడని పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement