విద్యుదాఘాతంతో రైతు మృతి | Former died with eletric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Oct 18 2015 8:04 PM | Updated on Oct 1 2018 2:44 PM

విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మట్టదొడ్డి గ్రామంలో ఆదివారం జరిగింది

విద్యుత్ షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మట్టదొడ్డి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన తిమ్మప్ప(45) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement