అగ్నిప్రమాదంలో వృద్దురాలి సజీవ దహనం | fire accident in nizamabad district | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో వృద్దురాలి సజీవ దహనం

May 15 2016 9:20 AM | Updated on Sep 5 2018 9:47 PM

నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వరనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో సంభవించింది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వరనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదంలో సంభవించింది. ఈ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో లచ్చవ్వ(62) అనే వృద్దురాలు సజీవ దహనమైంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని గుడిసెలు దగ్ధమయ్యాయని స్థానికులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న వారు మంటలను చూసి బయటికి పరుగుతీశారు. అయితే వృద్ధాప్యం కారణంగా లచ్చవ్వ బటికి రాలేకపోయి అగ్నికీలల్లో చిక్కుకుని మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement