ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ | discussion on pranahita - chevella in assembly | Sakshi
Sakshi News home page

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

Mar 15 2015 2:45 AM | Updated on Sep 2 2017 10:51 PM

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

ప్రాణహిత-చేవెళ్లపై పూర్తిస్థాయి చర్చ

శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.

 సాక్షి, హైదరాబాద్: శాననసభ సమావేశాలు ముగిశాక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో చర్చించాల్సి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రయోజనం అధికంగా ఉంటుందనే దానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన వాప్కోస్‌ను పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఈ నివేదికపై అందరి సమక్షంలో చర్చిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతం, కృష్ణా పరీవాహక ప్రాంతంలోని వాస్తవ పరిస్థితులపై అందరితో చర్చించి, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతామన్నారు. శనివారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు  నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ (సీడబ్ల్యూసీ) సమ్మతి,  తదితర వివరాలు తెలపాలంటూ ఎమ్మెల్సీ బి.వెంకటరావు వేసిన ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement