కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణ సమీపంలోని బొమ్మకల్ ఫ్లైవర్ వద్ద సోమవారం ఉదయం సగం కాలిన మృతదేహావ లభ్యమైంది.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణ సమీపంలోని బొమ్మకల్ ఫ్లైవర్ వద్ద సోమవారం ఉదయం సగం కాలిన మృతదేహావ లభ్యమైంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి అనంతరం దహనం చేశారా, లేక సజీవదహనం చేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. మృతుడి ఆనవాళ్లను బట్టి అతని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.