తెలంగాణలో ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు
కరోనా: తెలంగాణలో 928కి చేరిన కేసుల సంఖ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 928కి చేరుకుంది. తాజాగా మరో 8 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 194 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 23 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 711 గా ఉంది. ఇక తాజాగా నమోదైన కేసుల్లో సూర్యాపేటలో అత్యధికంగా 26, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 19 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్లో 3, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి.
(చదవండి: వైద్యులకు మాస్క్లు,పీపీ కిట్లు ఇవ్వాలి: హైకోర్టు)
(చదవండి: హైదరాబాద్లో లాక్డౌన్ బేఖాతరు)