హైదరాబాద్ ‌: మాదన్నపేటలో కరోనా కలకలం

Coronavirus: 25 Residents In Hyderabad Apartments Test Positive - Sakshi

 11 నెలల పసికందుతో పాటు ఓ గర్భిణి స్త్రీకి కూడా పాజిటివ్‌

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మాదన్నపేటలో కరోనా వైరస్‌ కలకలం రేగింది. తొలి సారిగా ఓ అపార్ట్‌మెంట్‌లో 25 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం 50 మందికి పరీక్షలు చేయగా... వీరిలో 'సగం మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 11 నెలల పసికందుతో పాటు ఓ గర్భిణి స్త్రీ కూడా ఉంది. మరో ఐదుగురి రిపోర్టులు రావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఒకేసారి భారీ కేసులు నమోదుకావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. (చదవండి : మ‌రోసారి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న అక్ష‌య్‌)

మాదన్నపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేలకు పైగా నర్సులతో స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలో నిర్వహించడం వల్ల కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరైన ఇతర ప్రాంతాలకు చెందిన మరో ఐదుగురికి పాజిటివ్  నిర్దారణ అయిoది. ( చదవండి : కరోనా నుంచి కోలుకున్న డాక్టర్‌కు బెదిరింపులు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top