తుది దశకు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు | Sakshi
Sakshi News home page

తుది దశకు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు

Published Thu, Apr 30 2015 3:40 AM

congress party membership programe in final stage

- జిల్లాల వారీగా కుంతియా, భట్టి సమీక్ష


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు గురువారంతో గడువు ముగియనుండటంతో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క గాంధీభవన్‌లో బుధవారం ఈ అంశంపై జిల్లాల వారీగా సమీక్షించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల సభ్యత్వ నమోదు తీరును వారు పరిశీలించారు.

ఈ సమీక్షల్లో సీఎల్‌పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ, ఇతర నాయకులు డి.శ్రీనివాస్, కె.ఆర్.సురేశ్ రెడ్డి, పద్మా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భిక్షమయ్యగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, ఆకుల లలిత, తాహెర్, సి.జె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో భట్టి మాట్లాడుతూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో చేపట్టనున్న పాదయాత్రకు రైతులను సమీకరించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మే రెండో వారంలో పర్యటన ఉంటుం దని, తేదీ, ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement