కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కేంద్రంలో శనివారం ఆందోళనకు దిగింది.
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కేంద్రంలో శనివారం ఆందోళనకు దిగింది. బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఖమ్మం ఎమ్మెల్యే అంజన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.