పంద్రాగస్టుకు ఖైదీల విడుదల

CM KCR Order For Release Prisoners Of Good Character On August 15th - Sakshi

సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్ ‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని హోంశాఖను ఆయన కోరారు. సీఎం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖైదీల విడుదలపై చర్చ జరిగింది. ఆగష్టు 15న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కారాగారాల్లో అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ కసరత్తు గురువారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని ఓ ఉన్నతాధికారి సాక్షికి వివరించారు. కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తెలంగాణ జైళ్లశాఖ దాదాపు 100 మందికి పైగా ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top