ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోది అంతం చేశారు.
రంగారెడ్డి (మోమిన్పేట) : ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో మోది అంతం చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా మోమిన్పేటలో వెలుగులోకి వచ్చింది.
మోమిన్పేటలోని కొత్త బస్టాండ్ సెంటర్లో సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తిని దుండగులు బండరాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని ఆదివారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.