సోమిడిలో అస్థిపంజరం లభ్యం

Body Of In The Well In Madikonda - Sakshi

మడికొండ : సోమిడి శివారులోని వ్యవసాయ బావిలో అస్థిపంజరం లభ్యమైన సంఘటన జరిగింది. మడికొండ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం శాటిపల్లి అశోక్‌రావు అనే ఉపాధ్యాయుడు శనివారం తన వ్యవసాయ బావిలో క్రేన్‌ సహాయంతో పూడిక తీయడానికి వెళ్లాడు. పూడిక తీస్తుండగా మొదటగా చెత్త వచ్చిన అనంతరం ప్యాంట్, తర్వాత షర్టుతో పాటు అస్థి పంజరం వచ్చినట్లు తెలిపారు. వెంటనే మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి ఇన్స్‌పెక్టర్‌ రాపెల్లి సంతోష్‌కుమార్, ఎస్సై కుమారస్వామి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడికి ఎలాంటి అనవాళ్లు లేవని కేవలం అస్తిపంజరం మాత్రమే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్‌ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్థానిక వీఆర్‌ఓ సురేందర్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top