పోలవరంపై బాబు కుట్ర | babu Conspiracy on polavaram project | Sakshi
Sakshi News home page

పోలవరంపై బాబు కుట్ర

May 29 2014 2:23 AM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరంపై బాబు కుట్ర - Sakshi

పోలవరంపై బాబు కుట్ర

పోలవరం ముంపు గ్రామాల పేరిట తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని టీఆర్‌ఎస్ నాయకుడు, నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.

 నిజామాబాద్‌అర్బన్,న్యూస్‌లైన్ : పోలవరం ముంపు గ్రామాల పేరిట తెలంగాణకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు గమనించాలని టీఆర్‌ఎస్ నాయకుడు, నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేయాలని ఆయన కోరారు. బుధవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఆంధ్ర- తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ ఉంటుందని ప్రకటించిన చంద్రబాబు తెలంగాణపై తన కుట్రపురితవైఖరిని మార్చుకోవడంలేదని విమర్శించారు.

ఎన్‌డీయే భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తెలంగాణకే పరిమితం చేయాలని, ఆంధ్ర నాయకుల కుట్రలను , కుతంత్రాలను ప్రజలు నిర్భయంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబునాయుడు టీడీపీని ఆంధ్రాకే పరిమితం చేసుకోవాలని తెలంగాణలో ఆయన పర్యటిస్తే ఇక్కడి ప్రజలు క్షమించవద్దని అన్నారు. చంద్రబాబు మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకని ఆయన కుట్రలు, కుతంత్రాలకు తిప్పికొట్టాలని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement