చీఫ్ విప్‌ను అడ్డుకున్న ఆశావర్కర్లు | Asha workers strike in Telangana continues | Sakshi
Sakshi News home page

చీఫ్ విప్‌ను అడ్డుకున్న ఆశావర్కర్లు

Sep 25 2015 3:48 PM | Updated on Sep 3 2017 9:58 AM

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలును ఆశావర్కర్లు శుక్రవారం అడ్డుకున్నారు.

ఆదిలాబాద్ (జైపూర్) : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలును ఆశావర్కర్లు శుక్రవారం అడ్డుకున్నారు. జైపూర్ మండలం శెట్టిపల్లిలో రూ.కోటి 75 లక్షలతో రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయనను ఆశావర్కర్లు నిలదీశారు. 24 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నదని ఆశావర్కర్లు వాపోయారు. దీనికి స్పందించిన ఆయన వారితో మాట్లాడుతూ..మీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement