- సాగు, తాగునీటి అవసరాలపై ఏపీ, తెలంగాణల ఈఎన్సీల చర్చ
- సాగర్, శ్రీశైలం కనీస నీటిమట్టాలకు దిగువ నీటినీ వాడుకుందాం
- ఈ ఏడాది సమస్యలను అధిగమిద్దాం.. కొనసాగుతున్న లేఖల పరంపర
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కంటే దిగువన ఉన్న నీటిని కూడా వాడుకోవడం ద్వారా ప్రస్తుత సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించుకొనే దిశగా ఏపీ, తెలంగాణలు అడుగులు వేస్తున్నాయి.
రెండు రాష్ట్రాలకు నీటి అవసరాలున్నాయని, ఎవరూ రాజీపడి తమ అవసరాలను వదులుకొనే పరిస్థితుల్లో లేనందున, ప్రాజెక్టులు దాదాపుగా ఖాళీ అయ్యే వరకు నీటిని వాడుకొని ఈ ఏడాది గట్టెక్కడమే ఉత్తమ మార్గంగా రెండు రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ చాంబర్లో సమావేశమయ్యారు. కనీస నీటిమట్టాలను పట్టించుకోకుండా రెండు ప్రాజెక్టులను వీలైనంత మేరకు ఖాళీ చేసి ప్రస్తుత అవసరాలు తీర్చుకోవాలనే ప్రతిపాదనపై చర్చించారు. అయితే ఎలాంటి తుది నిర్ణయానికీ రాలేదని తెలిసింది.
ప్రస్తుతం శ్రీశైలంలో 839.3 అడుగుల మట్టం వద్ద 60 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం 834 అడుగుల వరకు ఖాళీ చేయడానికి అవకాశం ఉంది. అయితే 800 అడుగుల వరకు ఖాళీ చేయాలని రెండు రాష్ట్రాలు యోచిస్తున్నాయి. నాగార్జునసాగర్లో ప్రస్తుతం 533 అడుగుల మట్టం వద్ద 174 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 510 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులో నీటిని 500 అడుగుల వరకు వాడుకోవాలనే ప్రతిపాదన ఉంది. కనీస నీటి మట్టాల కంటే దిగువన ఉన్న నీటిని కూడా వాడుకోవడంపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే.. మొత్తం 50-60 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
ఇలావుండగా.. నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాలు, కృష్ణా బోర్డు మధ్య లేఖల పరంపర కొనసాగుతోంది. రెం డురోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ‘రెండు రాష్ట్రాల కేటాయింపులు త్వరగా తేల్చాలి. ఏపీ ప్రభుత్వం తన వాటా కంటే 51 టీఎంసీల నీటిని అదనం గా వాడుకుంది. ఇంకా నీటి విడుదల కోసం ఒత్తిడి చేస్తోంది. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఈ ఏడాది వాడుకోలేదు. ఏపీ ఎడాపెడా నీటిని వాడుకుంటే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పడిపోతాయి.
తర్వాత వాడుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉండదు. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయాలి..’ అని పేర్కొంది. కాగా తెలంగాణ రాసిన లేఖ ప్రతిని జత చేస్తూ కృష్ణా బోర్డు ఏపీకి మంగళవారం మరో లేఖ రాసింది. ఆ రాష్ట్రం డిమాం డ్లను ప్రస్తావిస్తూ.. ఇరు రాష్ట్రాల అధికారులు సమస్యను పరిష్కరిం చుకోవాలని సూచిం చింది. బోర్డు సభ్యులైన ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీల మధ్య సయోధ్య లేకుండా బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేసింది.
ప్రాజెక్టులు ఖాళీ చేద్దామా!
Published Wed, Feb 11 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement