వ్యక్తి దారుణ హత్య | a person killed in chevella in rangareddy district | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Jan 27 2015 10:43 AM | Updated on Nov 9 2018 6:29 PM

ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం చోటుచేసుకుంది.

ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం చోటుచేసుకుంది. చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ గుండం(పుష్కరిణి) వద్ద ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో మోది హత్య చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల జాడను తెలుసుకునేందుకు జాగిలాలను రప్పించారు. మృతుడి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement