అటవీ శాఖ అధికారులపై కలప స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు.
జయశంకర్ భూపాలపల్లి: అటవీ శాఖ అధికారులపై కలప స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గుర్రంపేట శివారులో మంగళవారం చోటు చేసుకుంది. చెల్పూరు అటవీ రేంజ్ అధికారి విక్రముద్దీన్ మరో నలుగురు సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై అటవీ సిబ్బంది వెంకటాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.