బావిలో పడి బాలుడు మృతి | 8 years old boy drowns in well | Sakshi
Sakshi News home page

బావిలో పడి బాలుడు మృతి

Mar 7 2016 4:46 PM | Updated on Sep 3 2017 7:12 PM

వ్యవసాయ బావిలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

చెన్నారావుపేట (వరంగల్) : వ్యవసాయ బావిలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఊరుగొండ రాజు, దివ్య దంపతుల కుమారుడు రాజశేఖర్(8)కు మతి స్థిమితం లేదు. సోమవారం అతడిని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. కుటుంబసభ్యులు పనుల్లో నిమగ్నమై ఉండగా ఆడుకుంటూ బావి వద్దకు వెళ్లిన రాజశేఖర్ అందులో పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు అతని కోసం వెతగ్గా నీటిపై తేలియాడుతూ విగతజీవిగా కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement