రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మహిళా ప్రయాణికురాలి నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మహిళా ప్రయాణికురాలి నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళా ప్రయాణికురాలి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.