
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులను నిర్వహిస్తున్న 36 కార్పొరేట్ కాలేజీలకు శుక్రవారం ఇంటర్ విద్యా అధికారులు తాళాలు వేశారు. తనిఖీల్లో ఆయా కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడి కావడంతో నోటీసులు జారీ చేసి బంద్ చేయించారు. మేడ్చెల్ జిల్లాలో 13, హైదరా బాద్లో 15, రంగారెడ్డి జిల్లాలో 8 కాలేజీలకు తాళాలు వేశారు.