ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృత్యువాత
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది.
కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మండలంలోని పల్లిమక్త గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు కురుకళ్ల మనోహర్(13), కురుకళ్ల రాజు(14), ఎనగంటి సంజీవ్(16)లు ఈత కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. వీరు ముగ్గురూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను వెలికితీయించారు.