తెలంగాణలో మరో ఇద్దరు రైతుల మృతి | 2 farmers died in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో ఇద్దరు రైతుల మృతి

Oct 10 2015 1:11 PM | Updated on Sep 29 2018 7:10 PM

తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూను ఉన్నాయి. తాజాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే, మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటను చూసి పొలంలోనే ఓ రైతు గుండె ఆగింది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూను ఉన్నాయి. తాజాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే, మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటను చూసి పొలంలోనే ఓ రైతు గుండె ఆగింది. వివరాలు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము దేవయ్య(51) తనకున్న మూడెకరాల భూమిలో పత్తిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగా లేకపోవడంతో నష్టాపాలవుతున్నాడు. ఎన్నో ఆశలతో ఈ ఏడాది సాగు చేసిన పంటకూడా ఎండిపోవడంతో ఈరోజు ఉదయం పొలంలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు.

మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(50) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో పాటు వాటిని తీర్చే దారి కానరాక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement