ఆగి ఉన్న టిప్పర్ను డిండి నుంచి కల్వకుర్తి వైపు వస్తోన్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోట చేసుకుంది.
వంగూరు : మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కోనేటిపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్ను డిండి నుంచి కల్వకుర్తి వైపు వస్తోన్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోట చేసుకుంది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.