రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: ఉమ్మారెడ్డి | YSRCP MLC Ummareddy Venkateswarlu Slams Chandrababu | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: ఉమ్మారెడ్డి

Apr 13 2017 2:01 PM | Updated on Jul 28 2018 3:39 PM

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: ఉమ్మారెడ్డి - Sakshi

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం: ఉమ్మారెడ్డి

ప్రజాస్వామ్యానికి అంబేడ్కర్‌ అత్యంత విశిష్టతను ఆపాదిస్తే.. నేడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది.

విజయవాడ: ప్రజాస్వామ్యానికి అంబేడ్కర్‌ అత్యంత విశిష్టతను ఆపాదిస్తే.. నేడు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించే స్థానంలో ఉన్న వారు వ్యవహరిస్తున్న తీరు భాధకరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన గురువారం మాట్లాడుతూ.. ఒక పార్టీ లో గెలిచిన వారిని మరో పార్టీలో చేర్పించుకోవడం రాజ్యాంగబద్దమా..? ఆనాడు తలసాని పార్టీ మారితే విమర్శలు చేసిన చంద్రబాబు... ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement