ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నీతిగా ఉంటే విచారణను ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు.
'నీతిగా ఉంటే విచారణను ఎదుర్కో బాబు'
Sep 1 2016 3:35 PM | Updated on Jul 28 2018 6:51 PM
శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నీతిగా వ్యవహరించి ఉంటే విచారణను ఎదుర్కోవాలని వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాల వలసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ప్రతి రోజూ తాను నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని అన్నారు. వైఎస్జగన్ మోహన్ రెడ్డిలా విచారణను ఎదుర్కొని తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు.
Advertisement


