• నిషేధంపై ఉద్యమిస్తున్న తమిళయువత
• రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న ఆందోళనలు
• జనసంద్రంగా మారిన మెరీనా తీరం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మా ప్రాచీన క్రీడపై నిషేధం విధిస్తారా? ఇది తమిళ సంస్కృతిపై దాడి చేయడమే’ అంటూ చెన్నై సాగరతీరాన తమిళయువత శివాలెత్తింది. జల్లికట్టుపై విధించిన నిషేధం ఎత్తేయాలంటూ వేలాది మంది యువకులు మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీలు, వర్సిటీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి బీచ్కు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సహా అన్ని పార్టీల, కోలివుడ్ మద్దతు తోడవడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ ఆందోళనలు పెరగడంతో తమిళసర్కారు అప్రమత్తమైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు 51 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధానిని కలవనున్నారు.
పెటాను నిషేధించాలి..
జల్లికట్టును నిషేధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జంతుహక్కుల సంస్థ పెటాపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఆసంస్థను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలంగనల్లూర్, మధురైలోని తమ్ముక్కం గ్రౌండ్స్లోనూ యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శివగంగ జిల్లాలోని కందిపట్టి గ్రామంలో 100 ఎడ్లతో నిర్వహిస్తున్న మంజు విరాట్టు (ఎద్దులను లొంగదీసుకోవడం) ఉత్సవాన్ని అడ్డుకొని పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు.నటుడు విశాల్, కమెడియన్ వివేక్, శివకార్తికేయన్తో సహా పలువురు జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు. ఈవిషయమై జనవరి 20న ధర్నా చేస్తున్నట్లు దక్షణభారత సినీనటుల సంఘం ప్రకటించింది. జల్లికట్టు ఉద్యమాన్ని విదేశాల్లోని తమిళులు సైతం బలపరుస్తూ ఆందోళనలు చేపట్టారు. అమెరికా, లండన్, సింగపూర్, కెనడా దేశాల్లో వందలాది మంది తమిళులు బుధవారం ఉదయం ఆందోళనలు నిర్వహించారు.
జోక్యం చేసుకోం: హైకోర్టు
జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మెరినాబీచ్లో ఆందోళనలను న్యాయవాది కె. బాలు బుధవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మెరీనా బీచ్ ఏమీ ధర్నాస్థలం కాదని పేర్కొన్న కోర్టు, సర్వోన్నత న్యాయస్థానం నిషేధించినందున హైకోర్టుగాని, తమిళనాడు ప్రభుత్వంకాని ఏమీ చేయలేవని తేల్చి చెప్పింది.
బీజేపీ జాతీయ కార్యదర్శిపై కేసు: తిరుప్పూరు, మనప్పారై, ఉసిలంపట్టి, శివగంగై జిల్లా సింగంపునరీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అతిక్రమించి జల్లికట్టు నిర్వహించారు. సింగంపునరీలో జల్లికట్టుకు తన కాడెద్దును పంపిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆందోళన విరమించండి: సీఎం
జల్లికట్టుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతు ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తమిళనాడు సీఎం పన్నీర్సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం ప్రకటించారు. జల్లికట్టు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
తమిళనాట జల్లికట్టు ప్రకంపనలు
Published Thu, Jan 19 2017 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం
చిల్లర మాటలు.. ఉద్దెర పనులు
బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఆత్మకూరు నుంచి గెలిచి.. అత్యున్నత పదవులు అలంకరించి..
టీడీపీకి టన్నుల్లో భయం
● ఐదేళ్లలో సర్వేపల్లి ప్రగతి కొత్త పుంతలు
No Headline
చంద్రబాబువి మోసపూరిత వాగ్దానాలు
కొల్లేరుకు కొత్త రూపు జగన్తోనే సాధ్యం
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement