marina beach
-
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
చెన్నై: మెరీనా బీచ్లో తొక్కిసలాట.. పలువురి మృతి
చెన్నై: తమిళనాడు చెన్నై ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మెరీనా బీచ్లో ఎయిర్ షో అనంతరం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎయిర్ షో ముగిసిన తర్వాత జనాలు తిరిగి వెళ్తున్న సమయంలో రైల్వే స్టేషన్లోనూ తొక్కిసలాట జరిగింది. డీహైడ్రేషన్ కారణంగా సొమ్మసిల్లి 290 మంది పడిపోవటంతో ఆస్పత్రిలో చేర్పించారు. వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయిన 80 మందిని ఆసుపత్రి తరలించారు. Closecall#IndianAirForce #Chennai #ChennaiAirShow2024 #ChennaiAirShow #Airshow #ChennaiMarina #MarinaBeach ch pic.twitter.com/4FvsqaCNPh— Bharani Dharan (@bharani2dharan) October 6, 2024 ఎయిర్ షో చూసేందుకు లక్షాలాది మంది జనాలు తరలివచ్చారు. దీంతో ముందు జాగ్రత్తలు తీసుకోవటంలో పోలీసులు వైఫల్యం చెందారు. జనం భారీగా రావటంతో పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాటలో వందలాది మంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. The worst arrangement by the govtStampede in Marina!#IndianAirForce#tngovt #chennai #marina pic.twitter.com/Qjb6B1OvJg— Sankrithi (@sank_rang) October 6, 2024 వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలంలో సహయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్యలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.More people gathered here no cop to navigate the public!!No water and Bio toilets were arranged The government should arrange enough train and bus transport to relocate people from destination to parking .#Chennai#AirShow2024 pic.twitter.com/rrNU1GgOvG— ல.மோ. ஜெய்கணேஷ் (@jai_lm) October 6, 2024సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు మూడు లక్షలమందిపైగా లోకల్ ట్రైన్లలో ప్రయాణించనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే, మెట్రో స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షోను తిలకించడానికి మెరీనా బీచ్కు సుమారు 15 లక్షలకుపైగా ప్రజలు వచ్చినట్లు అంచనా. Marina Beach Chennai AF Day celebrationIndian Airforce came into existence on 08 Oct 1932 pic.twitter.com/r3jUS5wKTc— धर्म व देश से ऊपर कोई नही (@VaDharma) October 6, 2024లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో మెరీనా బీచ్ ఎయిర్ షో నమోదుకు విస్తృత ప్రచారం. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో ఎయిర్ షో ఏర్పాటు చేశారు.#WATCH | Chennai, Tamil Nadu | A woman seen being evacuated from a huge rush at the Mega Air Show on Marina Beach ahead of the 92nd Indian Air Force Day.There are reports of attendees fainting, rushed to the hospital due to heavy crowd presence and heat. pic.twitter.com/SgNEhuTnUH— ANI (@ANI) October 6, 2024 -
22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు
చెన్నై: గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్టైన ఇద్దరి నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేయడంతో సాక్ష్యాధారాలు లేని కారణంగా వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2022లో రాజగోపాల్, నాగేశ్వర రావు అనే ఇద్దరు వ్యక్తులు మారీనా బీచ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మరీనా పోలీసులు వీరి నుండి 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అందులోనుంచి 50 గ్రాములను మాత్రం పరీక్షల నిమిత్తం నార్కోటిక్ విభాగానికి పంపించారు. మిగిలిన మొత్తాన్ని వారి స్వాధీనంలోని ఉంచి నిందితులిద్దరినీ రిమాండుకు తరలించారు. ఈ కేసులో మరీనా పోలీసులు ఇప్పటికే ఛార్జిషీటు కూడా దాఖలు చేయగా అప్పటి నుంచి చెన్నై హైకోర్టులోని మాదకద్రవ్య నియంత్రణ విభగంలో న్యాయవిచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మంగళవారం కోర్టు పోలీసులను సాక్ష్యం సేకరించిన గంజాయిని కోర్టుకు చూపించమని కోరగా ఆ మొత్తాన్ని ఎలుకలు ఖాళీ చేసేశాయని చెప్పారు. దీంతో విచారణ సమయంలో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు రాజగోపాల్, నాగేశ్వర రావులను చెన్నై కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు -
విషాదం.. 8 నెలల గర్భిణీపై నుంచి దూసుకెళ్లిన మిలిటరీ బస్సు..
చెన్నై: నెలరోజులైతే పండటి బిడ్డకు జన్మనివ్వాల్సిన 8 నెలల గర్భిణీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు రాజధాని చెన్నై మెరీనా బీచ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి పేరు లలిత(22). ఆమె భర్త పేరు శివారెడ్డి(26). భారత నావికాదళంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తనను మెరీనా బీచ్ తీసుకెళ్లమని లలిత శివారెడ్డిని అడిగింది. దీంతో అతను ఆమెను బీచ్కు తీసుకెళ్లాడు. ఇద్దరూ గంటసేపు అక్కడే సేదతీరారు. అనంతరం తిరిగి క్వార్టర్స్ వెళ్లే క్రమంలో శివారెడ్డి నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో వెనకాల కూర్చున్న లలిత రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో నేవీకి చెందిన బస్సు వచ్చి లలితపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే లలిత కడుపులోని బిడ్డ అయినా బతుకుతుందేమో అన్న ఆశతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ బిడ్డ కూడా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో భార్యతో పాటు పుట్టబోయే బిడ్డను కూడా పోగొట్టుకుని శివారెడ్డి శోకసంద్రంలో మునిగిపోయాడు. చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం -
‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ...
అలుపెరగని కెరటాలు. ఆహ్లాదానికి వచ్చే జనాలు. ఉత్సాహం శృతి మించితే ప్రాణానికే ప్రమాదం. అదుపు చేయాలి పిల్లల్ని పెద్దల్ని. చెన్నై మెరీనా బీచ్ ప్రతి ఉదయం సాయంత్రం జన సముద్రం. వారు ప్రమాదాల బారిన పడకుండా అశ్వదళం నిత్యం గస్తీ కాస్తుంటుంది. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు ఉన్నారు. అశ్వాన్ని అధిరోహించి ఈ చివర నుంచి ఆ చివరకు కెరటాల మీద రేఖ గీస్తుంటారు. మగ పోలీసుల మాట కంటే ఈ మహిళా పోలీసుల మాటే జనం ఎక్కువగా వింటారు. జీను మీద కూచుని వీరు సాగించే సవారీ కష్టమైనది. స్ఫూర్తిదాయకమైనది. వారి పరిచయం. ‘బయల్దేరుదామా రజతి’ అంటుంది 34 ఏళ్ల సుకన్య డ్యూటీ ఎక్కబోతూ. 12 ఏళ్లుగా అశ్వదళంలో పని చేస్తున్న సుకన్యకు ప్రియమైన అశ్వం రజతి. డ్యూటీ వాళ్లిద్దరూ కలిసి చేయాలి. ఒకరు లేకుండా మరొకరికి డ్యూటీ అసంపూర్ణం. ‘గ్రేటర్ చెన్నై మౌంటెడ్ బ్రాంచ్’ (అశ్వదళం)లో ఇప్పుడు 26 అశ్వాలు ఉన్నాయి. వాటితో డ్యూటీ చేస్తున్న సిబ్బంది సంఖ్య 30. వారిలో ఐదుగురు మహిళా పోలీసులు. వీరి శాఖ పుదుపేటలో ఉంటుంది. వీరి ప్రధాన డ్యూటీ మెరీనా బీచ్ను కాపు కాయడమే. పోకిరీల నుంచి కాపాడాలి బంగాళాఖాతంలో అలల తాకిడి ఎక్కువ. విహారానికి వచ్చినవారు అత్యుత్సాహంతో లోపలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం. అందుకని సుకన్య, ఇతర గస్తీ సిబ్బంది అలల్లో తడుస్తూనే తిరుగుతూ సందర్శకులను తీరం వైపు తరుముతుంటారు. ‘అది ఒక్కటే కాదు... అమ్మాయిలను వేధించే పోకిరీల నుంచి, చైన్ స్నాచర్ల నుంచి, పార్కింగ్ దగ్గర వాహనాలు ఎత్తుకెళ్లే దొంగల నుంచి కూడా జనాన్ని కాపాడాలి. అలాగే తప్పిపోయిన పిల్లలను వెతికి పెట్టాలి. ఒక్కోసారి జనం తాకిడి ఎక్కువైతే చాలామంది పిల్లలు తప్పిపోతూ ఉంటారు’ అంటుంది సుకన్య. ‘నేను మామూలు లాఠీ పట్టుకుని నేల మీద యూనిఫామ్తో నడుస్తూ వస్తే ఏ పోకిరీ మాట వినడు. అదే గుర్రం మీద వస్తే ఆ కథే వేరు. పరిగెడతారు’ అంటుంది నవ్వుతూ. ప్రమాదాలు ఉంటాయి అయితే ఈ ఉద్యోగం అంత సామాన్యం కాదు. మన మూడ్ బాగలేకపోతే గుర్రం గ్రహిస్తుంది. అలాగే గుర్రం మూడ్ పాడైతే మనం గ్రహించాలి. ఈ రెంటి మధ్య సమన్వయం లేకపోతే ప్రమాదం. ‘ఒకసారి న్యూ ఇయర్ నైట్ జనం విపరీతంగా వచ్చారు బీచ్కి. గుర్రం బెదిరి భయంకరంగా పరిగెత్తింది. దాని మీద ఉన్న నా గుండెలు అవిసిపోయాయి. అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేము. అది ఆగాక ఒక్కసారిగా గెంతి, దాని మెడ నిమిరి అదుపులోకి తెచ్చాను’ అంటుంది సుకన్య. ఆమెతో పని చేసే జాస్మిన్ అనే కానిస్టేబుల్ను అయితే గుర్రం అలల్లోకి విసిరికొట్టింది. మణికట్టు విరిగితే ఆరునెలలక్కానీ మళ్లీ కళ్లేలు పట్టుకోవడం వీలు కాలేదు. మొత్తం ఐదుమంది ఇప్పుడు అశ్వదళంలో సుకన్య, జాస్మిన్, మాళవిక, పునీత, మహలక్ష్మి పని చేస్తున్నారు. సుకన్య, జాస్మిన్ సీనియర్లు అయితే మిగిలిన ముగ్గురూ జూనియర్లు. వీరంతా తమ తమ గుర్రాల మంచి చెడ్డలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ప్రతి రోజూ ఆహారం అందించాలి. అందుకు ఒక్కో గుర్రానికి 600 రూపాయలు ఖర్చుపెడుతోంది పోలీస్ శాఖ. గుర్రాలకు స్నానం చేయించడం, మసాజ్, గారం చేయడం ఇవన్నీ చేస్తేనే అవి స్నేహాన్ని పాటిస్తాయి. ‘మేమందరం డ్యూటీ దిగాక గుర్రాలను కాసేపు బుజ్జగించి ఇళ్లకు వెళతాం’ అంటుంది సుకన్య. ఈ గుర్రాలను ఉత్తర ప్రదేశ్ సహరన్పూర్ నుంచి, తమిళనాడు చెట్టినాడ్ నుంచి కొని తెస్తూ ఉంటారు. వీటి కోసంగా ఊటీ నుంచి రోజూ ప్రత్యేకం క్యారట్, గడ్డీ వస్తుంటుంది. పశువైద్యులు చెకప్లు నిర్వహిస్తారు. ‘నగరంలో కాసింత ఊపిరి పీల్చుకోవడానికి స్త్రీలు చాలామంది బీచ్కు వస్తారు. వాళ్లకు మమ్మల్ని చూస్తే ధైర్యం. డ్యూటీ తృప్తిగా చేయడానికి ఇంతకు మించి కారణం ఏముంది’ అంటారు మెరీనా ధీరలు. ఈసారి చెన్నై వెళితే వారిని చూడండి. సూపర్ సుకన్య కోయంబత్తూరుకు చెందిన సుకన్య అంతవరకూ మగవాళ్లు మాత్రమే పని చేసే అశ్వదళంలో మొదటిసారిగా చేరింది. ‘నేను సినిమాల్లోనే గుర్రాలు చూశాను అప్పటి వరకూ’ అంటుంది సుకన్య. కాని రెండు మూడు నెలల్లోనే ట్రైనింగ్లో సుకన్య గుర్రాన్ని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో నేర్చుకుంది. మూడేళ్ల క్రితం వరకూ కూడా మొత్తం అశ్వదళంలో ఆమె ఒక్కర్తే మహిళా పోలీస్. ‘మా ఇంట్లో వాళ్లు మొదట్లో ఈ ఉద్యోగానికి ఒప్పుకోలేదు. ఆడపిల్ల గుర్రం ఎక్కి గస్తీ కాయడం ఏంటి అని ఇప్పటికీ మా అమ్మానాన్నలు అనుకుంటారు. కాని నాకు ఈ ఉద్యోగమే ఇష్టం’ అంటుంది సుకన్య. ఉదయం నాలుగున్నరకు డ్యూటీ మొదలవుతుంది ఆమెది. గుర్రం ఎక్కి మెరీనా బీచ్లో వాకింగ్కి, విహారానికి, స్నానానికి వచ్చేవారిని అదుపు చేయాలి. వారిని కాపాడాలి. మెరీనా బీచ్ సుదీర్ఘమైన బీచ్. అందుకని గుర్రాలు గస్తీకి బాగా ఉపయోగపడతాయి. అశ్వదళం బ్రిటిష్ హయాం నుంచి ఉన్నా 1926 నుంచి మెరీనా బీచ్ గస్తీకి ఉపయోగిస్తున్నారు. కాని 2011 వరకూ మహిళలు ఎవరూ అందులో చేరలేదు. సుకన్యదే ఆ రికార్డు. ఉదయం 8 వరకూ డ్యూటీ ముగించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు గుర్రం ఎక్కుతుంది సుకన్య. 7 గంటల వరకూ డ్యూటీ చేస్తుంది. మొత్తం మీద గుర్రంతో ఆమె రోజూ ఆరు నుంచి ఏడు గంటల పాటు తీరంలో తిరుగుతుంది. -
తలైవికి కంగనా నివాళి
-
చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకమండప నిర్మాణ పనులను ఈ ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదేశించారు. ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్కు అంతిమ సంస్కారాలు నిర్వహించిన చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున అందమైన సమాధి నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఎంజీఆర్ సమాధి పేరొందిన పర్యాటక క్షేత్రంగా మారింది. ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత అన్నాడీఎంకేకు విజయవంతంగా సారధ్యం వహించిన జయలలిత పార్దివదేహాన్ని సైతం చెన్నై మెరీనాబీచ్ ఒడ్డున ఎంజీఆర్ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ ప్రదేశంలో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ఎడపాడి ప్రభుత్వం నాడే ప్రకటించింది. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే నిర్మాణంలో అమ్మ స్మారక మండపం సముద్ర తీరాల్లో సమాధుల నిర్మాణంపై పర్యావరణ నిషేధం ఉన్నట్లు కొందరు వివాదాలు లేవనెత్తినా వాటిని అధగమించి రూ.5.08 కోట్ల అంచనాతో పనులు కొనసాగుతున్నాయి. జయ సమాధి డిజైన్ను చెన్నై ఐఐటీ రూపకల్పన చేయగా మధ్యప్రదేశాన్ని కాంక్రీట్తో పినిక్స్ పక్షి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. అత్యంత క్లిష్టమైన నిర్మాణం కావడంతో ప్రజాపనులశాఖ అధికారులు పదేపదే పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో కొంత జాప్యం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. లాక్డౌన్ రోజుల్లో సైతం ప్రత్యేక అనుమతి పొంది నిరవధికంగా పనులను సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా స్మారకమండప నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ముఖ్యమంత్రి ఎడపాడి రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో వాకబు చేశారు. పనుల ప్రగతిని ఫొటోల ద్వారా సీఎంకు చూపించారు. చారిత్రాత్మక నిర్మాణంగా చరిత్రలో నిలవబోతున్న జయ స్మారక మండపం విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. హడావిడికి తావివ్వకుండా నాణ్యత పాటించాలని సూచించారు. ఈ ఏడాది జూలై మాసాంతానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. చదవండి: టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి -
50పైసల నుంచి రోజుకు 2లక్షల ఆదాయం వరకు!
‘చాలెంజ్’ సినిమాలో చిరంజీవిపది పైసలతో జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు.‘శివాజీ’ సినిమాలో రజనీకాంత్ వన్ రుపీతో లైఫ్ని ప్రారంభిస్తాడు.సవాల్గా తీసుకుంటారు ఇద్దరూ.సక్సెస్ అవుతారు. సేమ్.. వాళ్ల లాగే పట్రీషా యాభై పైసలతో జీవితాన్ని సవాల్గా తీసుకుని సక్సెస్ సాధించింది. పద్నాలుగు రెస్టారెంట్లతో... రోజుకిప్పుడు రెండు లక్షలు సంపాదిస్తోంది! పట్రీషా నారాయణ్.. చెన్నైలోని ‘సందీపా’ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ యజమాని. ఉండటానికి విలాసవంతమైన అపార్ట్మెంట్, అంతే లగ్జూరియస్ కారు, రెండువందల పైచిలుకు ఉద్యోగులకు బాస్! ఇక 2010 ‘ఫిక్కీ ఉమన్ ఎంట్రప్రెన్యూర్’ అవార్డీ అన్నది పాత సంగతే. అయితే పట్రీషాకు ఇవన్నీ వారసత్వంతో రాలేదు. ఆమె జీవితం వడ్డించిన విస్తరీ కాదు. అంతా రెక్కల కష్టం. పట్రీషా పుట్టి పెరిగింది చెన్నైలో. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్లో, తల్లి టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. పట్రీషాకు ఇద్దరు తోబుట్టువులు. ఆమే తొలి సంతానం. ఇంటర్ ఫస్టియర్లో ఉండగా తనకన్నా పదమూడేళ్లు పెద్దవాడైన నారాయణ్తో పరిచయమైంది. ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లీ జరిగింది. నిజానికి ఇంటర్ అయ్యాక తల్లిదండ్రులతో చెప్పి తమ పెళ్లికి వాళ్ల అంగీకారం తీసుకోవాలనుకుంది పట్రీషా. కాని నారాయణ్ వద్దన్నాడు. వెంటనే తనతో వచ్చేయమంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. పట్రీషా ఎంత నచ్చ జెప్పినా వినకపోగా ‘‘నువ్వు రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి మీవాళ్లకు అంతా చెప్పేస్తాను’’ అంటూ బెదిరించాడు. భయపడ్డ పట్రీషా ఓ రోజు ఇంట్లో చెప్పేసింది తను పెళ్లి చేసుకుందని. మండిపడ్డ ఆమె తండ్రి పట్రీషాను ఇంట్లోంచి గెంటేశాడు. అన్నానగర్లో కాపురం పెట్టారు పట్రీషా, నారాయణ్. కలిసి ఉంటున్నకొద్దీ నారాయణ్లోని దుర్గుణాలు బయటపడసాగాయి. బద్దకం. పనిచేయడు. పైపెచ్చు మందు, సిగరెట్లు. నచ్చిన వ్యక్తి భర్తగా దొరికాడన్న సంతోషం లేకుండానే దాంపత్యం సాగుతోంది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. నారాయణ్లో ఏ మాత్రం మంచి మార్పులేదు సరికదా.. మరింత దిగజారాడు. పట్రీషాను కొట్టడమూ మొదలు పెట్టాడు. వేరే దారి లేక అభిమానం చంపుకొని పుట్టింటికి వెళ్లింది. మొదట తండ్రి మండిపడ్డా.. కూతురి పరిస్థితి చూసి చలించిపోయాడు. ఇద్దరు పిల్లలతో ఉన్న బిడ్డను ఇంట్లోకి రానిచ్చాడు. నారాయణ్కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. తలూపింది పట్రీషా. పికిల్స్ అండ్ జామ్స్ తల్లి, తండ్రి ప్రభుత్వోద్యోగస్తులు కావడంతో వారికి చేసి పెట్టడానికి చిన్నప్పుడే వంట నేర్చుకుంది పట్రీషా. కుకింగ్ అంటే ఆసక్తి కూడా. అందుకే ఖాళీగా కూర్చోకుండా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసి బాటిళ్లలో పెట్టి తల్లితో ఆమె ఆఫీస్కి పంపించడం మొదలుపెట్టింది. అన్నీ అమ్ముడుపోవడమే కాక మూడు రోజులకే మళ్లీ డిమాండ్ కూడా వచ్చింది ఇంకా కావాలని. అలా పచ్చళ్లు, జామ్స్ తయారు చేసే వ్యాపకాన్ని వ్యాపారంగా మార్చుకుంది పట్రీషా. బీచ్లో టీ బండి పట్రీషా తండ్రి స్నేహితుడు ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పీపుల్ కోసం ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. వాళ్లకు ఓ ఉపాధి చూపించాలని టీ, టిఫిన్ బళ్లను తెప్పించాడు. పట్రీషా స్థితి తెలుసుకొని తన దగ్గరున్న ఇద్దరికి ఉపాధి ఇప్పిస్తే ఓ బండి ఇస్తానని చెప్పాడు. ఒప్పుకుంది ఆమె. వెంటనే వాళ్లిద్దరికీ టీ, కాఫీ పెట్టడం, వాటిని సర్వ్ చేయడం నేర్పింది. బండి తీసుకొని మెరీనా బీచ్లో పెట్టుకుంది. మొదటి రోజు కేవలం ఒకే ఒక్క టీ అమ్మగలిగింది. ఆరోజు సంపాదన యాభై పైసలు. నిరాశతో ఇంటికెళ్లింది. వ్యాపారం చేయడం తన వల్ల కాదని తల్లికి చెప్పి ఏడ్చింది. ‘‘ఒక్క టీ అమ్ముడు పోవడాన్ని నువ్వు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. అది నేను నీ సక్సెస్ అనుకుంటున్నా. జీరోతో రాకుండా యాభై పైసలు సంపాదించావు’’ అంటూ కూతురిలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టింది పట్రీషా. తెల్లవారికి సమోసా వంటి స్నాక్స్నూ బండీలో పెట్టింది టీ, కాఫీలతోపాటు. ఆశ్చర్యం ఆ రోజు ఆమె సంపాదన ఏడువందల రూపాయలు. ఇలా 1982 నుంచి 2003 వరకు సాగింది. తొలినాళ్లలో మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు వరకూ ఉండేది. ఆ తర్వాత మెరీనాబీచ్లో వాకర్స్ కోసం ఉదయం అయిదు గంటలకే ఓపెన్ చేసి తొమ్మిదింటి వరకూ బిజీగా ఉండేది. రోజుకి ఏడువందల రూపాయల నుంచి 25 వేలు ఆర్జించే వరకు వెళ్లింది ఆదాయం. బంద్ రోజుల్లో కూడా. కోలుకోలేని విషాదం పట్రీషా వంట రుచి ఆ నోటా ఈ నోటా బ్యాంక్ ఆఫ్ మధుౖరై ఉద్యోగుల దాకా వెళ్లింది. బ్యాంక్లో క్యాంటీన్ నిర్వహించడానికి ఆమెకు ఆఫర్ అందింది. మూడు వందల మందికి వండి వడ్డించాలి. తర్వాత నేషనల్ పోర్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్కూల్లోని ఏడువందల మంది స్టూడెంట్స్ కోసం వంట చేసే అవకాశం వచ్చింది. చేసింది. మేనేజ్మెంట్కు నచ్చింది. ఉండటానికి క్వార్టర్ కూడా ఇచ్చారు. అక్కడ ఆమె మొదటి నెల అందుకున్న జీతం ఎనభై వేలు (1998లో). తర్వాత అది కొద్దికాలానికే లక్ష రూపాయలకు చేరింది. కొంతకాలానికే సంగీతా రెస్టారెంట్ గ్రూప్ ఒక యూనిట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ చేసింది. అప్పటికే పిల్లలు పెద్దవాళ్లైపోయారు. కూతురు పెళ్లి చేసేసింది. కొడుకు ప్రవీణ్ రాజ్కుమార్ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. సంగీతా రెస్టారెంట్లో పార్ట్నర్షిప్ ఆఫర్ కన్నా సొంతంగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనను తల్లి ముందు పెట్టాడు ప్రవీణ్. పట్రీషాకూ సబబే అనిపించింది. ఆ ఏర్పాట్లలో ఉండగా కుటుంబం కుప్పకూలే సంఘటన! కూతురు, అల్లుడు కారు యాక్సిడెంట్లో చనిపోయారు. పట్రీషా చాన్నాళ్ల దాకా మనిషి కాలేకపోయింది. రెస్టారెంట్ పనంతా ప్రవీణే చూసుకున్నాడు. ఎట్టకేలకు 2006లో ‘సందీపా’ రెస్టారెంట్ను ప్రారంభించారు. అప్పటికీ పట్రీషా ఇంకా షాక్లోనే ఉంది. అందుకే మొత్తం బాధ్యతలు తీసుకోకుండా.. కొడుకుకి సహాయంగా మాత్రమే ఉంది కొన్నాళ్ల దాకా. కూతురు, అల్లుడు చనిపోయినప్పుడు డెడ్బాడీస్ తీసుకురావడానికి ఒక్క అంబులెన్సూ ముందుకు రాలేదు. చనిపోయిన వార్త కన్నా అంబులెన్స్ బాధ్యతా రాహిత్యం ఆమెను ఎక్కువ కలచివేసింది. అందుకే రెస్టారెంట్ పెట్టిన కొన్నాళ్లకు ఓ అంబులెన్స్ను కొని రోడ్ యాక్సిడెంట్ బాధితులను ఆసుపత్రికి చేర్చే సేవనూ అందిస్తోంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో..! ‘‘ఆత్మవిశ్వాసమే మనల్ని నడిపిస్తుంది. కష్టం లేకుండా ఫలితం రాదు. ఎదురు దెబ్బలే గమ్యానికి వారధి కడ్తాయి. గ్రహిస్తే గమ్యం చేరుకుని విజయం సాధిస్తాం’’ అంటుంది పట్రీషా. ఈ ముప్పైఏళ్లలో ఆమె నేర్చుకున్న సత్యం ఇదే. ఆమె ఫిలాసఫీ ఇదే. చెన్నైలో పట్రీషాకు ఇప్పుడు 14 అవుట్లెట్స్ ఉన్నాయి. ‘‘యాభై పైసల సంపాదన నుంచి రోజుకి రెండు లక్షల ఆదాయానికి చేరుకున్నాం. ఇది నా ఒక్కదాని కష్టం కాదు. నన్ను నమ్మి నాతోపాటు నడిచినవాళ్లందరి శ్రమ ఫలితం. కలెక్టివ్ విక్టరీ’’ అంటుంది పట్రీషా. – శరాది -
అందుకోసం నేను ప్రాణాలైనా విడిచేవాణ్ణి: స్టాలిన్
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో నిర్వహించి ఉండకపోయి ఉంటే.. తాను ప్రాణాలు విడిచి ఉండేవాడినని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దివంగత నేత కరుణానిధికి నివాళులర్పించేందుకు మంగళవారం చెన్నైలో జరిగిన డీఎంకే కార్యవర్గం భేటీ అయింది. ఈ భేటీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఆగస్టు 7న కరుణానిధి మరణించడానికి కొన్ని గంటల ముందు తానే స్వయంగా సీఎం పళనిస్వామి ఇంటికి వెళ్లానని స్టాలిన్ వివరించారు. ‘తలైవర్కు (కరుణాధి) డాక్టర్లు కొన్ని గంటల గడువు మాత్రమే ఇచ్చారు. దీంతో మెరీనా బీచ్లో స్థలం అడిగేందుకు ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని భావించాం. సీనియర్ లీడర్లు తాము వెళ్లి సీఎంను కలిసి ఈ విషయాన్ని నివేదిస్తామని చెప్పారు. మీరు స్వయంగా వెళ్లవద్దని చెప్పారు. అయినా, నా గౌరవాన్ని పక్కనపెట్టి నేను స్వయంగా సీఎం ఇంటికి వెళ్లాను. పళనిస్వామి చేతులు పట్టుకొని మరీ మెరీనా బీచ్లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాను. చట్టాలు అందుకు అనుమతించడం లేదని, లీగల్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా ఉందని పళనిస్వామి చెప్పాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నందున లీగల్ ఒపీనియన్ను మార్చుకోవచ్చునని నేను చెప్పాను. కానీ తన ఇంటినుంచి మమ్మల్ని పంపించే ఉద్దేశంతో ఈ విషయాన్ని పరిగణిస్తానని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కరుణానిధి మరణవార్తను వైద్యులు ప్రకటించారు. పార్టీ నేతలు వెంటనే వెళ్లి సీఎంను కలిసి.. మెరీనా బీచ్లో స్థలం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కానీ సీఎం అందుకు ఒప్పుకోలేదని వారు పదినిమిషాల్లో నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడు డీఎంకే లీగల్ సెల్ చీఫ్ విల్సన్ కోర్టును ఆశ్రయిద్దామని చెప్పాడు. మెరీనా బీచ్లో స్థలం వచ్చింది. ఇందుకు నేను విల్సన్కు రుణపడి ఉంటాను’ అని స్టాలిన్ భావోద్వేగంగా చెప్పారు. మెరీనా బీచ్లో కరుణానిధి సమాధి కోసం స్థలం ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించిన సంగతి తెలిసిందే. -
తుది వీడ్కోలు..!
వ్యక్తి ఆరాధన తమిళనాట తీవ్రస్థాయిలో ఉంటుంది. తాము ప్రేమించేనేత మరణిస్తే తట్టుకోలేక పెద్ద సంఖ్యలో అభిమానులు మృతిచెందిన సంఘటనలు గతంలో చూశాం. అలాగే ఆ నేతల చివరి చూపుల కోసం లక్షలాది మంది తరలివచ్చి అంతిమయాత్రల్లో పాల్గొన్న దృశ్యాలు తమిళనాడులో కనిపిస్తాయి. అభిమానం ఎంతగా ఉందంటే అన్నాదురై అంతిమయాత్రలో పాల్గొన్న వారి సంఖ్య గిన్నెస్బుక్లో కూడా రికార్డ్ అయ్యింది. అన్నా మొదలుకుని కరుణానిధి వరకు ఈ అంతిమయాత్రలు సాగిన తీరు ఇలా ఉంది. అన్నాదురై: తమ భావాలు, అభిప్రాయాలతో, చేపట్టిన కార్యక్రమాలు, పనులతో ప్రజలపై చెరగని ముద్ర వేసిన రాజకీయ ప్రముఖులు, నేతలకు మనదేశంలో నీరాజనాలు పట్టడం చూస్తుంటాం. ఇలాంటి నేతలు మరణించినపుడు వారి అంతిమయాత్రలో లెక్కకు మించి సంఖ్యలో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం తెలిసిందే. ద్రవిడోద్యమ దిగ్గజంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, తమిళ హక్కులు, సంస్కతి పరిరక్షణలో తుదికంటా పోరాడి తమిళనాడులోని వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిన మాజీ సీఎం అన్నాదురై 59 ఏళ్ల వయసులో కేన్సర్తో మరణించారు. 1969 ఫిబ్రవరి 3న జరిగిన ఆయన అంతిమయాత్రకు కోటిన్నర మంది ప్రజలు హాజరుకావడంతో ‘అత్యధిక సంఖ్యలో ప్రజలు పలికిన తుది వీడ్కోలు’గా గిన్నెస్ ప్రపంచరికార్డ్ నమోదైంది. చెన్నైలో అన్నాదురై భౌతికకాయంతో కూడిన శవపేటికను లక్షలాది మంది అనుసరిస్తున్న ఫోటోలు దీనికి సాక్ష్యంగా నిలిచాయి. ఎంజీఆర్: తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, భావజాల వ్యాప్తికి సినీమాధ్యమం ద్వారా కృషి చేసిన వారిలో అన్నాదురై, ఎం.కరుణానిధి, ఎంజీ.రామచంద్రన్ ప్రముఖులు. అయితే సినిమా తెరపై వాటిని తన నటనరూపంలో చూపి ఎంజీఆర్ ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎత్తిచూపుతూ, వారితో మమేకమయ్యేలా రూపొందించిన పాత్రలు (కథ,స్క్రీన్ ప్లే కరుణానిధి) ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆ తర్వాత ఆయన డీఎంకేతో విభేదించి సొంతంగా ఏఐడీఎంకేను స్థాపించి సీఎం పీఠాన్ని అధిరోహించారు. కొన్నేళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడి తిరిగి కోలుకోలేదు. 1987 డిసెంబర్ 24న 71 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులివ్వాల్సి వచ్చింది. అంతిమయాత్రలో చెలరేగిన హింసలో 29 మంది మరణించారు. 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 30 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఆర్ భౌతికకాయాన్ని ఉంచిన వాహనాన్ని అనుసరించినవారు, అంతిమయాత్రలో పాల్గొన్న వారు కలిపి దాదాపు పది లక్షల మంది ఉండొచ్చునని ఓ అంచనా. జయలలిత: సినీనటిగా జీవితం ప్రారంభించిన జె.జయలలిత, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఎంజీఆర్ సన్నిహితురాలిగా మారి ఎన్నో ఎత్తుపళ్లాలు చవిచూశారు. అటు ప్రతిపక్షపాత్రతో పాటు సీఎం పదవిని చేపట్టాక, అనేక సంక్షేమపథకాల అమలు ద్వారా పేదవర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. విప్లవనాయకి (పురచ్చి తలైవి)గా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. తమిళ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఎన్నికల్లో గెలుపోటములు చవిచూశారు. మళ్లీ సీఎంగా ఎన్నికై ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. చెన్నై మెరీనా బీచ్లో జరిగిన అంతిమయాత్రలో దాదాపు పదిలక్షల మంది పాల్గొన్నట్టుగా అంచనా వేస్తున్నారు. కరుణానిధి: తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేసిన మాజీ సీఎం ఎం.కరుణానిధి 94 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించారు. ఐదుసార్లు సీఎంగా, 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ పర్యాయం ఎమ్మెల్సీగా, దాదాపు 50 ఏళ్ల పాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆ రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. మెరీనా బీచ్లోనే కరుణానిధి భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు డీఎంకే పట్టుబట్టడంతో ఈ అంశంపై కోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది. చివరకు న్యాయస్థానం దానికి అనుకూలంగానే ఆదేశాలిచ్చింది. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలు వద్ద ఉంచిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందినట్టు పలువురు గాయపడినట్లు వార్తాసంస్థలు వెల్లడించాయి. అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన వారి నియంత్రణకు పోలీసులు లాఠీచార్జీ జరపడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఈ అంతిమయాత్ర చెన్నై నగర వీధుల మీదుగా మెరీనా బీచ్కు చేరుకుంది. దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్నేతల్లో ఒకరైన కరుణానిధి అంతిమయాత్రలో లక్షల్లో ప్రజలు పాల్గొన్నట్టుగా అంచనావేస్తున్నారు. మెరీనా తీరంలోనే మాజీ సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత సమాధుల పక్కనే కరుణానిధి పార్ధివదేహాన్ని కూడా ఖననం చేశారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్ కిరికిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్లోనే అంత్యక్రియలకు అనుమతించాలని డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్(ఎంజీఆర్ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్లో అనుమతించలేదు. ప్రోట్కాల్(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది. కామరాజ్, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ లాంటి వాళ్లకే మెరీనా బీచ్లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్లో గందరగోళం చెలరేగగా.. సైలెంట్గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్ కోసమే బెంచ్ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం. -
లైన్ క్లియర్!.. తీర్పు ఆలస్యం?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, కలైంగర్ కరుణానిధి అంత్యక్రియలపై నెలకొన్న ప్రతిష్టంభన దాదాపు వీడింది. ఈ వ్యవహారంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి(84) ప్రకటించారు. దీంతో రామస్వామి దాఖలు చేసిన పిటిషన్తోపాటు గతంలో దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను(ఐదింటిని) మద్రాస్ హైకోర్టు బెంచ్ డిస్మిస్ చేసింది. అయితే కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన పిటీషన్పై మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అత్యవసర తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడటంతో.. తీర్పును కాస్త ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (కరుణానిధి అరుదైన ఫోటోలు.. క్లిక్ చేయండి) గతంలో మెరీనా బీచ్లో పలువురి స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణ అంత్యక్రియలకు ఆ పిటిషన్ ఆటంకంగా మారింది. కోర్టు కేసుల నేపథ్యంలో అంత్యక్రియలకు స్థలం కేటాయించలేమని పళని ప్రభుత్వం పేర్కొంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. గత రాత్రి నుంచి ఈ వ్యవహారంపై వాదనలు జరిగాయి. చివరకు తదుపరి వాదనలు ఈ ఉదయానికి వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో ఉత్కంఠ నెలకోగా, రామస్వామితో చీఫ్ జస్టిస్ వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతనే మెరీనా బీచ్లో అంత్యక్రియలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ రాతపూర్వకంగా ఆయన బెంచ్కు ఓ మెమొరాండం సమర్పించారు. అంతేకాదు పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కోర్టులో ప్రభుత్వం, డీఎంకే తరపు న్యాయవాదుల మధ్య వాడివేడి వాదనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు అత్యవసరంగా తీర్పు ప్రకటించాల్సిన అవసరం లేదన్న చీఫ్ జస్టిస్.. ఈ రోజే తీర్పు ప్రకటిస్తామని చెప్పారు. (నిండు సభలో దుశ్శాసన పర్వం) ‘తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని’ జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు కూడా. కానీ, రామస్వామి పిటిషన్ మూలంగానే న్యాయపరమైన చిక్కుల నెలకొన్నాయన్న విషయం తర్వాతే తేలింది. (అమ్మకు ఘన నివాళి) (కరుణ వల్లే ఇదంతా...) -
కరుణ అంత్యక్రియలు ఎక్కడ?
సాక్షి, చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే అంశంపై తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. మెరీనా బీచ్లో అన్నాదురై స్మారకం పక్కనే కరుణ అంత్యక్రియలు జరపాలని డీఎంకే పట్టుబడుతోంది. ఇందుకోసం ఏకంగా స్టాలినే ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అయితే.. మెరీనాలో అంత్యక్రియలకు అనుమతివ్వబోమని పళనిస్వామి ప్రభుత్వం స్పష్టం చేసింది. మెరీనా బీచ్లో స్మారకానికి న్యాయపరమైన చిక్కులున్నాయని అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ కుదరదని తేల్చి చెప్పింది. దీంతో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తాత్కాలిక న్యాయమూర్తి కులువాడి రమేష్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ వివాదంపై విచారణ ప్రారంభించింది. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినా ఎటూ తేలలేదు. దీంతో విచారణ బుధవారం ఉదయం 8 గంటలకు వాయిదా పడింది. మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు జరపాలంటూ సినీనటుడు రజనీకాంత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు డిమాండ్ చేశారు. ప్రజాజీవితాన్ని మరిచారా?: స్టాలిన్ కరుణానిధి ప్రజా జీవితం, ఆయన రాజకీయాలకు చేసిన సేవలను గుర్తుంచుకుని మెరీనా బీచ్లో అంత్యక్రియలకు అనుమతివ్వాలని స్టాలిన్ లేఖ రాశారు. సీఎం పళనిస్వామికి రాసిన ఈ లేఖలో.. కరుణానిధి రాజకీయ గురువైన అన్నాదురై స్మారకం పక్కన మౌజోలియం కాంప్లెక్స్ లోపల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలన్నారు. కరుణ మృతికి కొద్ది గంటల ముందు సీఎంను స్టాలిన్ కలిశారు. అటు, ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా మెరీనా బీచ్లో కరుణ స్మారకానికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందుల్లేవని న్యాయమూర్తికి డీఎంకే తరఫు లాయర్ వెల్లడించారు. సీఆర్జెడ్ (కోస్ట్ రెగ్యులేషన్ జోన్) పరిధిలోకి వస్తుందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంలో వాస్తవం లేదని న్యాయమూర్తికి ఆయన తెలిపారు. అన్నా సమాధి ఉన్న స్థలం కోస్టల్ జోన్ పరిధిలో లేదని, అది కూవం నదీ తీరంలో ఉన్నట్టు వివరించారు. అన్నా సమాధి వద్ద కరుణానిధి సమాధి ఏర్పాటుకు అవకాశం ఉందని, అయితే, తాము వేసి ఉన్న కేసుల్ని సాకుగా చూపించి, స్థలం కేటాయించకుండా ప్రభుత్వం నిరాకరించడాన్ని ఖండిస్తున్నామని జయ స్మారకం నిర్మాణంపై కేసు వేసిన న్యాయవాదులు బాలు, దురైస్వామిలు పేర్కొన్నారు. తాము వేసిన పిటిషన్ల ఆధారంగానే న్యాయపరమైన చిక్కులున్నట్లుగా భావిస్తే.. ఆ కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని ప్రకటించారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా తీరంలోని అన్నా సమాధి పక్కనే కేటాయించాలని కోరారు. అయితే, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలుచేసిన పిటిషన్తో చిక్కులున్న కారణంగా న్యాయమూర్తి ముందు వాదనలు జోరుగా సాగాయి. (మెరీనా బీచ్లో అంత్యక్రియలకు తమిళసర్కారు నో చెప్పడంతో బీభత్సం సృష్టిస్తున్న కార్యకర్తలు) చిక్కులు తొలగిపోలేదు: ప్రభుత్వం మెరీనా బీచ్లో స్థలం కేటాయించడం కుదరదని.. మాజీ ముఖ్యమంత్రులైన చక్రవర్తి రాజగోపాలచారి, కే కామరాజ్ల స్మారకాలున్న గిండీ ప్రాంతంలోని గాంధీ మండపంలో రెండెకరాల స్థలం కేటాయిస్తామని ప్రభుతవం వెల్లడించింది. కరుణానిధి సిట్టింగ్ సీఎం కానందునే మెరీనాబీచ్లో అంత్యక్రియలకు అనుమతిచ్చేందుకు పళనిస్వామి నిరాకరించారని తెలిసింది. అన్నాదురై, ఎంజీఆర్, జయలలితలు సీఎంలుగా ఉంటూ కన్నుమూసినందుకే వారికి సముద్రం ఒడ్డున స్మారకం నిర్మించారు. ఎంజీఆర్, జయలలితలు కరుణానిధికి రాజకీయంగా బద్ధ శత్రువులు. ప్రభుత్వ నిర్ణయం తెలియడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి వద్ద ఉన్న కార్యకర్తలు ఆగ్రహంతో బారికేడ్లు తెంచుకుని రోడ్లపైకి పరిగెత్తారు. పరిస్థితి చేయిదాటుతుందని ఊహించిన పోలీసులు డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టారు. మెరీనాలోనే కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కార్యకర్తలు చెన్నై నగరంలో పలుచోట్ల వాహనాలను తగులబెట్టారు. మమతా బెనర్జీ నివాళి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం రాత్రి గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసానికి చేరుకుని కరుణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. సినీనటుడు రజనీకాంత్ కూడా కరుణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కరుణ మృతికి సంతాపం తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బుధవారం చెన్నైకి రానున్నారు. ప్రముఖుల సంతాపాలు ‘కరుణానిధి మరణం చాలా బాధించింది. ప్రజానేతగా, తమిళనాడు అభివృద్ధిలో భాగస్వామిగా కీలకపాత్ర పోషించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, డీఎంకే కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయాభివృద్ధికి కరుణ తన జీవితాన్ని అంకితం చేశారు’ –రాష్ట్రపతి కోవింద్ ‘దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రముఖ నాయకుడు కరుణానిధి. ఆయన మరణం తీవ్ర విచారకరం. మొత్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి 56 ఏళ్లపాటు ఆయన తమిళనాడు శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. ఐదుపర్యాయాలు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు సేవలందించారు’. –ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘కలైజ్ఞర్ కరుణానిధి ఇక లేరనే వార్త బాధాకరం. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నేతల్లో ఆయనొకరు. ఓ బలమైన మాస్లీడర్, గొప్ప ఆలోచనాపరుడు, మంచి రచయిత, పేదలు, అణగారిన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతను కోల్పోయాం’ –ప్రధాని మోదీ ‘తమిళ ప్రజలకు కరుణానిధి అంటే ఎంతో ప్రేమ. ఆరు దశాబ్దాలపాటు ఆయన తమిళ, దేశ రాజకీయాలకు విశేష సేవలందించారు. ఆయన మరణంతో దేశం ఓ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఆయన కుటుంబానికి, ఆయన మరణానికి చింతిస్తున్న కోట్లాది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’ –కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కరుణానిధి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. డీఎంకే నేతలు, కార్యకర్తలు, కలైజ్ఞర్ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. పాఠశాలలో చదివే రోజుల నుంచే ఆయన కళా రంగంలోనూ రాణిస్తూ, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు’ – తమిళనాడు సీఎం పళనిస్వామి ‘కలైజ్ఞర్ మృతి మరచిపోలేనిది. నా జీవితంలో ఇదో చీకటి రోజు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’.–ప్రముఖ నటుడు రజనీకాంత్ గొప్ప మానవతావాది: గవర్నర్ నరసింహన్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు గొప్ప పరిపాలనా దక్షుడిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి గొప్ప మానవతావాది అని నరసింహన్ పేర్కొన్నారు. భారత రాజకీయ రంగానికి తీరని లోటు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: కరుణానిధి మృతి పట్ల తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి తమిళ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా, క్రియాశీల నాయకుడిగా సేవలందించారన్నారు. సామాన్య ప్రజలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. కరుణానిధి మరణం భారతదేశ రాజకీయ రంగానికి తీరని లోటు అని కేసీఆర్ అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయాం: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కరుణానిధి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్కు కరుణానిధి మరణం వార్త తెలియగానే సంతాపం ప్రకటించారు. ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధిది ఒక విశిష్ట స్థానమని, సినిమా రచయితగానే కాకుండా ద్రవిడ రాజకీయాలను శాసించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణ అని జగన్ కొనియాడారు. -
కుటుంబాన్ని రక్షించబోయి వ్యక్తి మృతి
సాక్షి, హసన్పర్తి: విహార యాత్రలో విషాదం అలుముకుంది. చెన్నైలోని మెరినో బీచ్లో నీటి అలలకు వరంగల్ నగరానికి చెందిన పాలకుర్తి సురేష్(44) కొట్టుకుపోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విహార యాత్ర నిమిత్తం వారం రోజుల క్రితం సురేష్ కుటుంబంతోపాటు మరో రెండు కుటుంబాల సభ్యులు చెన్నైలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. చివరిగా రామేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి శుక్రవారం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. రైలు ఆలస్యం ఉండడంతో సమీపంలోని మెరినో బీచ్కు వెళ్లారు. అందరూ స్నానం చేసే క్రమంలో అలలు ఎగిసి పడి సురేష్ భార్య మాధవి, కుమారుడు సాత్విక్, కూతురు శ్రీజ నీటిలో మునిగిపోతుండగా వారిని రక్షించడానికి సురేష్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు నీటిలో కొట్టుకుపోయినట్లు బంధువులు తెలిపారు. పదినిమిషాల తర్వాత సురేష్ మృతదేహాం ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు అక్కడక్కడే కుప్పకూలిపోయారు. రామన్నపేటలో అద్దె ఇంట్లో నివాసం.. సురేష్ కుటుంబం నగరంలోని రామన్నపేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటోంది. అయితే ఇటీవల అతడు హసన్పర్తిలో ఓ ఇంటిని కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చాడు. రామన్నపేటలో ఉంటూ హన్మకొండలో మెడికల్ షాపు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. సురేష్ అంత్యక్రియలు ఆదివారం హసన్పర్తిలోని ఆర్యవైశ్య శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
ప్రఖ్యాత నటుడి విగ్రహం తొలగింపు
సాక్షి, చెన్నై: మెరీనా తీరంలో ఉన్న ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్ నిలువెత్తు విగ్రహాన్ని చడీ చప్పుడు కాకుండా, రాత్రికి రాత్రే అధికారులు తొలగించడం వివాదానికి దారి తీసింది. అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినీ వినీలాకాశంలో నడిగర్ తిలగం, నట ఖ్యాతిని చాటిన శివాజీ గణేశన్ గౌరవాన్ని చాటేలా 2006లో చెన్నై మెరీనా తీరంలో డీఎంకే ప్రభుత్వం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. కామరాజర్ రోడ్డు, రాధాకృష్ణన్ రోడ్డు కూడలిలో ఎనిమిది అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం గంభీరంగా దర్శనం ఇస్తుంటుంది. ఈ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా గాంధేయ వాది శ్రీనివాసన్ 2011లో కోర్టును ఆశ్రయించారు. ఈ విగ్రహం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. విగ్రహం తొలగింపుకు కోర్టు తీర్పు ఇవ్వడంతో అభిమానుల్లో ఆవేదన బయలుదేరింది. అయితే, అడయార్లో శివాజీ గణేశన్కు స్మారక మండపం నిర్మిస్తున్నామని, అంతవరకు విగ్రహం తొలగించబోమని దివంగత సీఎం జయలలిత ప్రకటించారు. ప్రస్తుతం ఆ మండపం పనులు ముగింపు దశకు చేరడంతో బుధవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో చడీ చప్పుడు కాకుండా విగ్రహాన్ని అధికారులు తరలించారు. గురువారం ఉదయం చూసేసరికి విగ్రహం లేకపోవడంతో అభిమానులు అవాక్కయ్యారు. తమ అభిమాన నటుడి విగ్రహం తొలగించిన ప్రదేశంలో పాలాభిషేకం చేశారు. కాగా, మెరీనా తీరంలో రోడ్డు పక్కగా మరో విగ్రహం ఏర్పాటుకు చట్టపరంగా అభిమానులతో కలిసిముందుకు సాగుతామని శివాజీ గణేశన్ తనయులు, నటులు ప్రభు, రామ్కుమార్ తెలిపారు. కాగా, ఉన్నపళంగా అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించడాన్ని తమిళ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
జయలలితకు మూడుసార్లు మొక్కి..
-
ఆమోదం
► జల్లికట్టు ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర ► జల్లికట్టు అభిమానుల ఆనందహేల ► ‘అల్లరి’ పోలీసులపై వేటు ► అల్లర్ల వెనుక కుట్ర : విపక్షాల ఆగ్రహం తమిళనాడు ప్రజలకు దేశ రాజధాని నుంచి సోమవారం శుభవార్త అందింది. ఈ శుభవార్త చెవిన పడగానే రాష్ట్ర ప్రజలు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడమే ప్రజల ఆనందానికి కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై కొన్నేళ్ల క్రితం విధింపబడిన నిషేధం రాష్ట్ర ప్రజలను తీరని ఆవేదనకు గురిచేసింది. ఆవేదన ఆగ్రహంగా మారి ఆం దోళనలకు దారితీసింది. మూడేళ్లుగా పొంగల్ పండుగ సమయాల్లో జల్లికట్టు ఆందోళనలు సాగుతూ చల్లారిపోతున్నాయి. అయితే ఈ ఏడాది జల్లికట్టు ఉద్యమంలోకి క్రీడాకారులు, అభిమానులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం రంగప్రవేశం చేశారు. దీంతో చెన్నై మెరీనా బీచ్ తీరమే వేదికగా చేసుకుని సాగించిన ఆందోళనలు ఆకాశాన్ని అంటాయి. తమ డిమాండ్ను సాధించేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని జల్లికట్టుపై పట్టుపట్టారు. భార్యా పిల్లలతో కుటుంబాలు సైతం మెరీనాతీరానికి తరలిరాగా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీఎం పన్నీర్సెల్వం స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. జల్లికట్టు ఉద్యమంపై అడ్డంకులను తొలగిస్తూ ఈ నెల 22వ తేదీన ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. అయితే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదించేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. అదే రోజు రాత్రి విద్యార్థి సంఘాల నేతలతో మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆందోళనను విరమింపజేసేందుకు 23వ తేదీ తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు తమవంతు ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ పోలీసులు, ఉద్యమకారుల మధ్య చర్చలు బెడిసికొట్టాయి. పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రారంభమై లాఠీచార్జీ, భాష్పవాయి ప్రయోగాలు, గాలిలోకి కాల్పులు, పోలీస్స్టేషన్, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల దగ్ధం తదితర అవాంఛనీయ సంఘటనలవైపు ఉద్యమం మళ్లింది. చెన్నై మెరీనాతీరంలోని కొందరు ఉద్యమకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు కారణమైన మరికొందరిని జైళ్లలోకి నెట్టారు. ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపగా జల్లికట్టు ఉద్యమకారులు ఇంటి బాట పట్టారు. అల్లర్ల సమయంలోనే జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ద్వారా రాష్ట్రపతికి చేరుకుంది. అలాగే ఆర్డినెన్స్ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం కాపీని సైతం రాష్ట్రపతికి పంపారు. దీంతో జల్లికట్టు ఉద్యమానికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సోమవారం ఆమోదముద్ర వేయడంతో కథ సుఖాంతమైంది. ‘అల్లరి’ పోలీసులపై త్వరలో వేటు జల్లికట్టు అల్లర్లను అవకాశంగా తీసుకుని అక్రమాలకు పాల్పడిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడనున్నట్లు సమాచారం. ఈ నెల 23వ తేదీన చెన్నై నగరంలో పలు విధ్వంసక చర్యలు చోటుచేసుకోగా వీటిల్లోని 35 సంఘటనలను కొందరు సెల్ఫోన్ ద్వారా వీడియోలో చిత్రీకరించి వాట్సాప్లో పెట్టారు. రోడ్డు వారగా నిలిపి ఉన్న ఆటోకు ఒక మహిళా కానిస్టేబుల్ నిప్పుపెట్టడం, మరికొందరు పోలీసులు రోడ్లపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేయడం వంటి సన్నివేశాలు వాట్సాప్ల ద్వారా ప్రసారం కావడం పోలీసు శాఖను అప్రతిష్టపాలు చేసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. వాట్సాప్ దృశ్యాల ద్వారా పోలీసులను గుర్తించారు. వీరందరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారు. నిలిచి ఉన్న ఒక ఆటోకు నిప్పుపెట్టిన మహిళా కానిస్టేబుల్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసినవారిపై త్వరలో సస్పెన్షన్ వేటు పడనున్నట్లు తెలిసింది. రెండు వారాలు వాయిదా చెన్నై మెరీనాతీరంలో అల్లర్ల ఆరోపణలపై అరెస్టయిన వారికి బెయిల్ మంజూరుకు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో రెండు వారాలు వాయిదా పడింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాల్సిందిగా కోరుతూ ఈ నెల 23వ తేదీన పోలీసులు జరిపిన చర్చలకు సమ్మతించని ఉద్యమకారులు అల్లర్లకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అల్లర్ల సమయంలో ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 280 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బదులు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా పోలీస్శాఖ చేసిన విజ్ఞప్తిని మన్నించిన న్యాయమూర్తి మహాదేవన్ కేసు విచారణను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విపక్షాల ఆగ్రహం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమంలో ఉద్రిక్తతలు సృష్టిం చి కుట్రపూరితంగా అణచి వేశారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమంలో ఉద్దేశ పూర్వకంగా పోలీసులే అల్లర్లు సృష్టించారని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సోమవారం ఆరోపించారు. వారం రోజులపాటూ శాంతియుత వాతావరణంలో ఉద్యమం చేస్తున్న వారిని చెదరగొట్టే ఉద్దేశంతోనే పోలీసులు రంగ ప్రవేశం చేశారని ఆయన అన్నారు. పోలీసుల జోక్యానికి నిరసనగా ఉద్యమకారులు సముద్రతీరంలోకి వెళ్లగా వారికి రక్షణగా నిలిచిన మత్స్యకారులను సైతం అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. 23వ తేదీ జరిగిన అల్లర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన కోరారు. జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంపై పార్లమెంటులో గళం విప్పుతానని రాజ్యసభ సభ్యురాలు (డీఎంకే) కనిమొళి సోమవారం తెలిపారు. -
ఘనతంత్ర సంబరాలు
► ‘పన్నీరు’ పతాకావిష్కరణ ►వేడుకల్లో స్టాలిన్, డీఎంకే ఎమ్మెల్యేలు గణతంత్ర సంబరాలు రాష్ట్రంలో మిన్నంటాయి. చెన్నై మెరీనా తీరంలో జరిగిన వేడుకల్లో ప్రప్రథమంగా సీఎం పన్నీరు సెల్వం జాతీయ జెండాను ఎగురవేశారు. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేత, డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం. సాక్షి, చెన్నై: 68వ గణతంత్ర దినోత్సవాలు చెన్నై మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం ఉదయం ఘనంగా జరిగాయి. గాంధీ విగ్రహం పరిసరాలను వివిధ వర్ణాల పుష్పాలతో అధికార యంత్రాంగం సుందరంగా తీర్చిదిద్దింది. రాష్ట్రానికి శాశ్వత గవర్నర్ లేని దృష్ట్యా, ప్రప్రథమంగా సీఎం పన్నీరుసెల్వం గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఎగుర వేయడానికి ఉదయం ఏడున్నర గంటల సమయంలో మెరీనా తీరానికి వచ్చారు. మోటార్ సైకిళ్లు ముందుకు దూసుకురాగా, పన్నీరు కాన్వాయ్ మెరీనా తీరం వైపుగా సాగుతూ అక్కడక్కడ ఆశీనులైన జనానికి సీఎం అభివాదం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, సలహాదారు షీలాబాలకృష్ణన్ ఆహ్వానించారు. అనంతరం త్రివిధ దళాల అధిపతుల్ని పరిచయం చేశారు. సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో జాతీయ పతాకాన్ని పన్నీరుసెల్వం ఎగురవేయగా, భారత కోస్ట్గార్డ్ హెలికాప్టర్ ఆకాశం నుంచి పుష్ప జల్లులు కురిపించింది. జాతీయ పతాకానికి మెరీనా తీరంలో గుమికూడిన ప్రతి ఒక్కరూ గౌరవ వందనం సమర్పించారు. తదుపరి త్రివిధ దళాల కవాతు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ , మహిళా కమాండో బలగాలు విన్యాసాలు, అశ్వదళాల మార్చ్ ఫాస్ట్ సాగాయి. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: తమిళనాడు చరిత్ర ను, సంప్రదాయాన్ని, గ్రామీణ కళల్ని, దేశ ఔన్నత్యాన్ని, వివిధ రాష్ట్రాల సంస్కృతుల్ని చాటి చెప్పే రీతిలో విద్యార్థినునులు ప్రదర్శించిన నతృత్య రూపకం ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యరూపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే, ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో ఆయా విభాగాల శకటాల ప్రదర్శన ప్రతి ఒక్కర్నీ ఆలోచింప చేశాయి. అమ్మ జయలలిత పథకాలను, సేవల్ని గుర్తు చేస్తూ, శకటాల ప్రదర్శన సాగాయి. పతకాలతో సత్కారం: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాహస వీరులకు పతకాలను ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రదానం చేశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు వీరోచితంగా శ్రమించిన వారికి ఇచ్చే అన్నా పతకాన్ని వేలూరు జిల్లా పేర్నంబట్టుకు చెందిన దుర్గాదేవికి అందజేశారు. కోట్టై అమీర్ మత సామరస్య అవార్డును వేలూరుకు చెందిన డాక్టర్ విక్రంకు ప్రదానం చేశారు. సారాను, నకిలీ మద్యాన్ని అరికట్టడంలో విశేష కృషిచేసిన ఎక్సైజ్ ఏఎస్పీ తంగమలై(నాగపట్నం), సెంట్రల్క్రైం ఏఎస్పీ జీవానందం, అడయార్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ వేలు, నాగపట్నం సెంట్రల్ సబ్ ఇన్ స్పెక్టర్ రమేష్కుమార్, ధర్మపురి తోప్పురు ప్రత్యేక సబ్ ఇన్ స్పెక్టర్ మాధప్పన్ లకు గాంధీ అడిగలార్ బిరుదు, రూ. 20 వేలు చొప్పున చెక్కుల్ని అందజేశారు.వరి సాగులో ఆధునిక పోకడలకు సంబంధించిన వ్యవసాయ శాఖ ప్రత్యేక అవార్డు, రూ.ఐదు లక్ష నగదు చెక్కును తిరునల్వేలి జిల్లా పులియంగుడికి చెందిన శంకరనారాయణకు అందజేశారు. స్టాలిన్ హాజరు : ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో ప్రప్రథమంగా సీఎం పన్నీరు సెల్వం పతాకాన్ని ఆవిష్కరించగా, ఈ వేడుకకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సైతం హాజరు కావడం ఆహ్వానించ దగ్గ విషయం. ఇన్నాళ్లు ప్రతి పక్ష సభ్యులు ప్రభుత్వ వేడుకలకు దూరం అన్న విషయం తెలిసిందే. తాజా, వేడుకకు డీఎంకే ఎమ్మెల్యేలు దురైమురుగన్, సుబ్రమణియన్, శేఖర్బాబు, రంగనాథన్, మాధవరం సుదర్శనం, సెల్వం, కేపీపీస్వామి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. వీరిని ఆహ్వానించిన అధికారులు స్టాలిన్ కు మాత్రం మంత్రుల వరుసలో సీటు కేటాయించారు. ఎమ్మెల్యేలకు వీపీఐల వరుసలో సీట్లను కేటాయించారు. ఇక, గతంతో పోల్చితే ఈ సారి వేడుకలకు జనం దూరంగా ఉండడం గమనార్హం. మెరీనా పరిసరాల్లోని జాలర్ల కుటుంబాలు పెద్ద ఎత్తున వేడుకలకు తరలి రావడం జరిగేది. అయితే, జల్లికట్టు నిరసనల సమయంలో జాలర్ల మీద పోలీసులు తీవ్ర ప్రతాపాన్ని చూపించారు. దీంతో జాలర్లు వేడుకకు దూరంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మునుపెన్నడూ లేని విధంగా పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేయడంతో జనంలో స్పందన కరువైంది. పలువురు నల్ల టీ షర్టులు, చొక్కాలతో సాధారణంగా వేడుక నిమిత్తం వచ్చినా, వారిని పోలీసులు అ డ్డుకోవడం గమనార్హం. ఇక, ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు మహారాష్ట్రలో జరిగిన వేడుకకు పరిమితం కావడంతో చెన్నై రాజ్ భవన్ లో జరగాల్సిన తేనీటి విందు రద్దు అయింది. ఇక, రాష్ట్ర ప్రజలకు రేడియో ద్వారా తన సందేశాన్ని విద్యాసాగర్ రావు వినిపించారు. మెరీనా తీరంలో వేడుకల అనంతరం వార్ మెమోరియల్ స్మారక స్థూపం వద్ద సిఎం పన్నీరు సెల్వం నివాళులు అర్పించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ఆహ్వానం పలికారు. -
కలకలం
► అల్లర్ల వెనుక అదృశ్య శక్తులు ► పోలీసులపై అనుమానాలు ► వాట్సాప్ వీడియోలో దృశ్యాలు ► మెరీనాలో మళ్లీ ఆందోళనకారులు ► జల్లికట్టు ఎద్దుదాడిలో ఇద్దరు మృతి జల్లికట్టు ఉద్యమం అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అల్లర్లను సృష్టించేందుకు పోలీసులే ప్రత్యేక పాత్ర పోషించారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియా వాట్సాప్ ద్వారా ప్రచారంలోకి రావడం కలకలాన్ని రేపింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జల్లికట్టుకు అనుమతి కోరుతూ చెన్నై మెరీనాబీచ్ తీరంలో ఈనెల 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. 20వ తేదీన జల్లికట్టు ఉద్యమకారులు చేపట్టిన బంద్ అనూహ్యరీతిలో సక్సెస్ అయింది. బంద్లో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. అయినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. 21వ తేదీన ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన తరువాత ఆందోళన విరమించాల్సిందిగా సీఎం పన్నీర్సెల్వం కోరారు. అయితే శాశ్వత చట్టం తెచ్చేవరకు ఆందోళన విరమించబోమని ఉద్యమకారులు స్పష్టం చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఉద్యమకారులతో చర్చలు జరిపారు. అయినా వారు ససేమిరా అనడంతో సోమవారం నాడు బలవంతంగా వారిని పంపివేసే ప్రయత్నం చేశారు. దీంతో మెరీనాతీరంలో స్వల్పంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్రమేణా పరిస్థితి తీవ్రరూపం దాల్చగా చెన్నై ఐస్ హౌస్ పోలీస్స్టేషన్ కు నిప్పు, వందలాది వాహనాల దగ్ధం, పోలీసులపై పెట్రో బాంబులు విసరడం వంటి చర్యలతో నగరం రణరంగంగా మారిపోయింది. పోలీసులు గాల్లోకి కాల్పులు, భాష్పవాయువు ప్రయోగాలు చేయాల్సివచ్చింది. కాగా, సుమారు వందమందికి పైగా యువకులు సోమవారం రాత్రి వడపళని పోలీస్స్టేషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చెదరగొట్టారు. అలాగే మరికొంత మంది అసాంఘిక శక్తులు ఆరంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ లోకి చొరపడి సీసీ కెమెరా, కిటికీలను పగులగొట్టారు. అలాగే ఆరుంబాక్కంలోని ఒక ప్రముఖ హోటల్కు స్వల్పంగా ఆస్తినష్టం కలిగించారు. రెండు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి మెషిన్లను ధ్వంసం చేశారు. ఏటీఎంలలో నగదు లేకపోవడంతో చోరీ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగే ఆర్కాడు నుంచి వేలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు విద్యార్థులు పెట్రో బాంబులు విసిరి పారిపోయారు. అయితే బాంబులు పేలక పోవడంతో బస్సులోని 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బైటపడ్డారు. అయితే బస్సు కండక్టర్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఆందోళనకారులతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చలు ఫలించగా జల్లికట్టు ఉద్యమాన్ని విరమించారు. తమిళనాడు అసెంబ్లీలో సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించిన జల్లికట్టు ఆర్డినెన్స్ ను గవర్నర్ విద్యాసాగర్రావు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడు, అవనియాపురంలలో వరుసగా వచ్చేనెల 1,2, 5వ తేదీల్లో జల్లికట్టు క్రీడను జరుపుతున్న దృష్ట్యా పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పోలీసులే పాత్రధారులా: సోమవారం నాటి అల్లర్లకు పోలీసులే తెరవెనుక పాత్రధారులనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో పార్క్చేసి ఉన్న ఆటోలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ నిప్పుపెడుతున్న వీడియో రాష్ట్రంలో హల్చల్ చేసింది. ప్లాస్టిక్ సంచుల్లో పెట్రోలు తీసుకుని పోలీసులే స్వయంగా ఆటోపై చల్లి నిప్పుపెడుతున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. సమీపంలోని ఒక మిద్దెపై నుంచి తన సెల్ఫోన్ లో వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ‘ పోలీసులే తగులబెడతారా, రాష్ట్రంలో ఏమి జరుగుతోంది’ అంటూ ఆంగ్లంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న మాటలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని ఉద్రిక్తతల వైపు మళ్లించేందుకు పోలీసులే పథకం వేశారా అనే అనుమానాలు నెలకొన్నాయి. అంతేగాక విద్యార్థుల ముసుగులో కొన్ని అ సాంఘిక శక్తులు విధ్వంసక చర్యల్లో పాల్గొన్నట్లు సందేహిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులే పాల్పడడం దురదృష్టకరమని సదరు వీడియోను ఉద్దేశించి డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. నటుడు కమల్హాసన్ సైతం ఆ వీడియోను చూశానని పేర్కొం టూ పోలీస్ చర్యల పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సోమవారం నాటి అల్లర్లపై సీబీఐ విచారణ జరిపించాల్సింది గా పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు. మెరీనాలో అదే సీన్ : చెన్నై మెరీనా బీచ్లో వందల సంఖ్యలో జల్లికట్టుపై ఉద్యమకారులు మంగళవారం కూడా ఆందోళనను కొనసాగించారు. సోమవారం నాటి అల్లర్ల నేపథ్యంలో అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడిచిపెట్టాలని, వారిపై పెట్టిన కేసులను వాపసు తీసుకోవాలని డిమాండ్లపై ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని వారు చెప్పారు. అంతేగాక ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తరువాతనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఆందోళకారులను అదుపుచేసేందుకు వందమందికి పైగా పోలీసులను బందోబస్తు పెట్టి చర్చలు జరుపుతున్నారు. వంద మందికి పైగా అరెస్ట్: జల్లికట్టు ఉద్యమంలో భాగంగా ఉద్రిక్తతలు సృష్టించారనే ఆరోపణలపై చెన్నై నగరానికి చెందిన వందమందికి పైగా యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మూరు, అన్నాసమాధి, ఐస్హౌస్, అన్నాశాలై, మైలాపూర్, ట్రిప్లికేన్, వడపళని, కీల్పాక్, కొట్టూరుపురం తదితర 15 ప్రాంతాలకు చెందిన వారు అరెస్టయిన వారిలో ఉన్నారు. అలాగే పోలీసులపై దాడి చేసిన ఆరోపణలపై మరో 11 మందిని అరెస్ట్ చేశారు. చెన్నైలో సోమవారం నాటి అల్లర్లలో 232 వాహనాలు ధ్వంసంకాగా, 160 చోట్ల రాస్తారోకోలు జరిగాయని, అదనపు కమిషనర్ సహా 96 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీస్స్టేషన్ కు నిప్పుపెట్టిన 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మైలాపూరు పోలీస్స్టేషన్ ను ఆందోళనకారలు మంగళ వారం ముట్టడించారు. అసాంఘిక శక్తుల నుంచి పోలీ సులను రక్షించేందుకు చెన్నై ఎమ్కేపీ నగర్కు చెందిన ప్రజలు వారికి సాధారణ వస్రా్తలు ఇచ్చి ప్రజల్లో కలిసిపోయేలా చేసి ఆదుకున్న సంగతి వెల్లడైంది. పోలీస్ సహా ఇద్దరు మృతి: విరుదునగర్ జిల్లా కాన్సాపురంలో సోమవారం జరిగి న జల్లికట్టు ఒక పోలీసు ప్రాణాలను హరించింది. 50కి పైగా ఎద్దులను వాడివాసల్ గుండా వదిలారు. వందమందికి పైగా జల్లికట్టు వీరులు ఆ ఎద్దులను తమ అదుపులోకి తీసుకునేందుకు వాటి వెంట పరుగులు పెట్టా రు. పుదుపట్టికి చెందిన ఒక ఎద్దు అకస్మాత్తుగా జనంలోకి చొచ్చుకుని వచ్చి తోసేయడం ప్రారంభించింది. అక్కడే బందోబస్తులో ఉన్న అదే గ్రామానికి చెందిన ఏఆర్ పోలీసు జయశంకర్ (26)ను కొమ్ములతో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మదురైకి తరలిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందాడు. జయశంకర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పుదుక్కోట్టై జిల్లా రాపూసల్లో జల్లికట్టు సమయంలో కరుప్పయ్య (30)ను ఎద్దు పొడవడంతో తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందు తూ సోమవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
రణరంగంగా మారిన చెన్నై
-
రణరంగంగా మెరీనా బీచ్
► పోలీస్స్టేషన్ దహనం ► వాహనాలు దగ్ధం ► ఆందోళనకారులపై లాఠీచార్జీలు ► సంఘ విద్రోహశక్తులుగా అనుమానం ► అట్టుడికిన రాష్ట్రం ప్రశాంతంగా సాగుతున్న జల్లికట్టు ఉద్యమం ఉద్రిక్తతలకు దారితీసింది. జల్లికట్టు ఉద్యమాన్ని విరమించాలని కోరినందుకు ఆగ్రహించిన ఆందోళనకారుల విధ్వంసంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. చెన్నైలో పోలీస్స్టేషన్ దహనం, వాహనాల దగ్ధం, లాఠీచార్జీలు, భాష్పవాయువు ప్రయోగాలతో రాష్ట్రం రణరంగంగా మారిపోయింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళుల సంప్రదాయ జల్లికట్టుపై విధింపబడి ఉన్న నిషేధాన్ని తొలగించాలని కోరుతూ వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న సంగతి పాఠకులకు విదితమే. మధురై జిల్లా అలంగానల్లూరులో ఈ నెల 16వ తేదీన, చెన్నై మెరీనాబీచ్లో 17వ తేదీన ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వీరికి మద్దతుగా రాష్ట్రం లోని ప్రజలంతా ఎక్కడికక్కడ ఉద్యమించారు. 20వ తేదీన భారీస్థాయిలో బంద్ నిర్వహించగా ప్రపంచమే నివ్వెరపోయేలా ఆందోళనకారులు బంద్ను విజయవంతం చేశారు. ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ అనుమతి తీసుకుని ఈ నెల 21వ తేదీన జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ వార్త వెలువడిన తరువాత కూడా ఉద్యమకారులు ఆందోళనను విరమించలేదు. చెన్నై మెరీనాబీచ్ను వీడిపోలేదు. ఆర్డినెన్స్ తాత్కాలిక ఊరట మాత్రమే, శాశ్వత చట్టం తెచ్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని భీష్మించుకున్నారు. రాష్ట్రం నలుమూలలా అదే జోరున జల్లికట్టు ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఆర్డినెన్స్ తెచ్చిన రోజున రెండుసార్లు మీడియా వద్దకు వచ్చిన సీఎం ఇది శాశ్వత చట్టంగా రూపొందుతుందని మొరపెట్టుకున్నా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్డే వేడుకలకు ఇక మూడు రోజులే ఉన్న తరుణంలో, చెన్నై మెరీనాబీచ్రోడ్డే వేడుకలకు వేదిక కావడంతో ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేయించక తప్పలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులతో పోలీసులు చర్చలు జరిపినా, పలువురు ప్రముఖులతో చెప్పించినా వినకపోవడంతో పెద్ద సంఖ్యలో మెరీనాను చుట్టుముట్టారు. బతిమాలినా వినకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను బలవంతంగా లాగివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో భాష్పవాయువును ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కొందరు ఆందోళనకారులు సముద్రంలోకి వెళ్లి నిలబడి బెదిరించడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే సముద్రంలోని వారికి ఆహారం, తాగునీరు అందకకుండా చేయడంతో ఒకరొకరుగా సముద్రం నుంచి వెలుపలకు వచ్చేశారు. జల్లికట్టు ఉద్యమకారులపై చెన్నైలో లాఠీచార్జీ చేశారనే సమాచారం రాష్ట్రంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. మధురై, కోయంబత్తూరు, విరుదునగర్, సేలం తదితర జిల్లాల్లో ప్రజలు రోడ్లపై బైఠాయించారు. వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. అగ్నికి ఆహుతైన ఐస్హౌస్ పోలీసు స్టేషన్ చెన్నై మెరీనాతీరంలో పోలీసులు చెదరగొట్టిన ఆందోళనకారుల్లో 50 మంది అక్కడికి సమీపం ట్రిప్లికేన్ లోని ఐస్హౌస్ పోలీసు స్టేషన్ కు వచ్చి రెచ్చిపోయారు. పోలీసులు వారించినా వినిపించుకోకుండా పెట్రోలో బాంబులు విసిరారు. పోలీసు స్టేషన్ బైట తాళం పెట్టి దగ్ధం చేశారు. పోలీసు స్టేషన్ నుంచి మంటలు ఎగిసిపడుతుండగా లోన చిక్కుకుని ఉన్న 14 మంది సిబ్బంది కిటీకి తలుపులు పగలగొట్టుకుని బయటకు వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసు స్టేషన్ వాకిట ఉన్న ద్విచక్రవాహనాలు, నగరంలో కొన్ని చోట్ల నాలుగు కార్లను దగ్ధం చేశారు. పరస్పర దాడుల్లో పోలీసులు, ఉద్యమకారులు తీవ్రంగా గాయపడ్డారు. లాఠీచార్జీకి నిరసనగా చెన్నైలోని అన్ని కూడళ్లలో కొందరు రాస్తారోకో చేసి అలజడి సృష్టించారు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రానికి చెన్నై మెరీనా తీరాన్ని పోలీసులు ఖాళీ చేయించగలిగారు. ఆందోళన వెనుక అదృశ్యశక్తులు ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగిన ఆందోళనలు సోమవారం అకస్మాత్తుగా ఉద్రిక్తతకు దారితీయడం వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయని అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘ విద్రోహ శక్తులను ప్రవేశపెట్టి ఉండవచ్చని అనే అనుమానం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. ఇది పసిగట్టే మెరీనా తీరాన్ని ఖాళీ చేయించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. అయితే అంతలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంత ఉద్యమంలో పోలీసులు జోక్యం చేసుకోవడమే ఉద్రిక్తతకు కారణమని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం రణరంగంగా మారిపోయిన తరుణంలో ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సోమవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. -
ఉధృతమవుతున్న జల్లికట్టు ఉద్యమం
-
మాట్లాడుతూ భోరుమన్న లారెన్స్!
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్లో ఉద్యమిస్తున్న యువతను పోలీసులు బలవంతంగా తరలిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు లారెన్స్ ఆవేదనతో స్పందించారు. మెరీనా బీచ్లోని యువతతో చర్చలు జరుపాలని తాము నిన్నరాత్రే నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇంతలోనే పోలీసులు మెరీనా బీచ్పై విరుచుకుపడి.. యువతను బలవంతంగా తరలిస్తుండటంతో అక్కడ భయాందోళన రేకెత్తించే వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరీనా బీచ్ నుంచి ఓ మహిళ తనకు ఫోన్ చేసి.. టీవీ చూడమని చెప్పిందని, టీవీ పెట్టి చూస్తే.. పోలీసుల వల్ల మెరీనా బీచ్లో ఉన్న యువత భయాందోళనకరంగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మెరీనా బీచ్ వెళ్లేందుకు ప్రయత్నించానని, తాను ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. గంటలోపు ఎట్టిపరిస్థితుల్లో, ఎలాగైనా మెరీనా బీచ్కు చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అంతలోపు యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, భయాందోళనకు గురికావొద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సముద్రంలోకి దిగి యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంటే.. గుండె తరుక్కుపోతున్నదని ఆయన కంటతడి పెడుతూ చెప్పారు. ఏది ఏమైనా మీ ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యమైనవని, యువత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. -
తగలబడుతున్న చెన్నై!
-
తగలబడుతున్న చెన్నై!
పోలీసు వాహనాలకు నిప్పు భగ్గుమన్న ఆందోళనకారులు తమిళనాట అంతటా అదుపు తప్పుతున్న నిరసనలు ఉధృతమవుతున్న జల్లికట్టు ఉద్యమం చెన్నై: తమిళనాట జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాలుస్తోంది. హింసాత్మకంగా మారుతోంది. మెరీనా బీచ్లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు చేయి దాటాయి. తమిళనాడు అంతటా నిరసనలు అదుపు తప్పుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు జల్లికట్టు ఉద్యమానికి ముఖ్య కేంద్రమైన మెరీనా బీచ్లోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న ఐస్హౌస్ పోలీసు స్టేషన్కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తగలబడుతున్న పోలీసు వాహనాలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. -
మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..
-
మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలో దూకేస్తాం..
చెన్నై: నిన్నటిదాకా నినాదాలతో హోరెత్తిన చెన్నై మెరీనా బీచ్లో ఇప్పుడు బెదిరింపుల కేకలు వినిపిస్తున్నాయి. జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో అక్కడ కలకలం చెలరేగింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు సోమవారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు బీచ్ను ఖాళీచేయించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు "మమ్మల్ని అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాం.."అని బెదిరించారు. మూకుమ్మడిగా జాతీయగీతాన్ని ఆలపిస్తూ పోలీసులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయినాసరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఒకవైపు బీచ్ను ఖాళీ చేయిస్తూనే, అటువైపునకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు. ఆందోళనలకు నేతృత్వ వహిస్తోన్న బృందం ఒకటి పోలీసులతో మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవిస్తామని, అయితే మధ్యాహ్నం దాకా నిరసనలకు అనుమతినివ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా నిరసన విరమిస్తామని వేడుకున్నారు. కానీ అందుకు పోలీసులు అంగీకరించేదు. "మీ లక్ష్యం నెరవేరింది. జల్లికట్టుకై ఆర్డినెన్స్ వచ్చింది. ఆట కూడా మొదలైంది. కాబట్టి మీరు ఆందోళన విరమించి, వెళ్లిపోండి"అని హెచ్చరించారు. అప్పటికీ వెనక్కి తగ్గని నిరసనకారుల్లో కొందరు సముద్రంవైపునకు పరుగెత్తే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా వ్యాన్లు ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. శాశ్వతపరిష్కారం లభించేదాకా బీచ్నుంచి కదిలేదిలేదని బైఠాచించిన నిరసనకారులకు స్థానిక మత్స్యకారులు కూడా తోడవ్వడంతో పోలీసుల ప్రయత్నాలు జఠిలమయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు దారుణంగా కొడుతున్నారని కొందరు యువకులు మీడియాతో అన్నారు. చెన్నైతోపాటు మధురై జిల్లాలోనూ జల్లికట్టుపై శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి. -
అర్ధరాత్రి.. గుట్టుగా ఆందోళనస్థలికి సూపర్ స్టార్!
జల్లికట్టు ఆందోళనకు విజయ్ మద్దతు తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు మద్దతుగా వేలాదిమంది యువత జరిపన ఆందోళనకు మద్దతుగా తమిళ సినీ నటుల సంఘం నడిగర్ మౌన నిరసన ప్రదర్శన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నిరసన ప్రదర్శనలో సూపర్ స్టార్ రజనీకాంత్తోపాటు పలువురు తమిళ అగ్రనటులు పాల్గొన్నారు. అయితే, ఇందులో తమిళ అగ్రహీరో, ఇలయదళపతి విజయ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అదే రోజు రాత్రి విజయ్ మేరినా బీచ్ వద్ద ఆందోళన చేస్తున్న లక్షలమంది యువతకు ఆయన మద్దతు పలికారు. వారితో కలిసి నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు. జల్లికట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. జల్లికట్టు ఆందోళనకు ముఖ్యకేంద్రంగా ఉన్న చెన్నైలోని మెరీనా బీచ్కు రహస్యంగా వచ్చిన విజయ్ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నిరసనలో పాల్గొన్నారు. తాను పాల్గొనడం వల్ల అందరి దృష్టి తనపై పడి.. ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఆయన ఇలా గుట్టుగా పాల్గొన్నారని సన్నిహత వర్గాలు తెలిపాయి. నడిగర్ సంఘం జరిపిన మౌనప్రదర్శనను యువత తప్పుబట్టారు. తాము జోరుగా చేస్తున్న ఆందోళన నుంచి మీడియా దృష్టిని ఇది మరలుస్తుందని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో నేరుగా యువత మనోగతానికి అనుగుణంగా వారితో కలిసి విజయ్ ఆందోళనలో పాల్గొన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అర్థరాత్రి మేరినా బీచ్లో కనిపించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు
-
ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు
జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నై మెరీనా బీచ్లో ప్రదర్శనకారులు వెనక్కి వెళ్లలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్షలు మానలేదు. అంతా ఓకే అనుకున్నా కూడా ఎందుకలా జరుగుతోంది? వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాలామందికి అనుమానాలున్నాయి. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటి తుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఆట కోసం ఆర్డినెన్స్) అందుకే.. ఆర్డినెన్సు కాపీ తమకు చూపించడంతో పాటు.. రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తర్వాత మాత్రమే తాము ఇక్కడినుంచి కదిలి వెళ్తామని మెరీనా బీచ్లో గత ఐదు రోజులుగా నిరసన తెలియజేస్తున్న యువత చెబుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో శనివారం నాడు ఒక్కరోజు నిరాహార దీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పార్టీ అగ్రనేతలు ఎంకే స్టాలిన్, కనిమొళి కూడా స్వయంగా ఈ దీక్షల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం నిర్వహించిన రైల్ రోకోలో కూడా వీళ్లిద్దరూ పాల్గొన్నారు. -
‘జల్లికట్టు’పై ఎవరిది రైటు?
న్యూఢిల్లీ: తమిళనాడులో జల్లికట్టును సమర్థిస్తున్నవారు ఇది తమ సంస్కతిలో భాగమని, జల్లికట్టులో పాల్గొనే ఎద్దులను తాము ఆప్యాయంగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. జల్లికట్టు పేరిట జంతువులను హింసిస్తున్నారని నిషేధాన్ని సమర్థిస్తున్న పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. ఇందులో ఎవరి వాదన ఒప్పు, ఎవరి వాదన తప్పని చర్చిస్తున్న వారు కూడా లేకపోలేదు. జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ చెన్నై మెరీనా బీచ్లో ఆందోళన చేస్తున్న ప్రజలు మరో పక్క జంతువుల హక్కుల కోసం పోరాడుతున్న పెటా సంస్థపై నిషేధం విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం. టెస్టోస్టెరోన్ వాడుతున్నారట... ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల ప్రాథమిక హక్కు. ఆ హక్కు జల్లికట్టును సమర్థిస్తున్న ప్రజలకే కాకుండా, వ్యతిరేకిస్తున్న పెటా కార్యకర్తలకు కూడా ఉంటుంది. జల్లికట్టు ఆట వ్యవసాయ సంస్కృతి నుంచి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సంస్కతిని రక్షించుకోవడంలో ఎలాంటి తప్పులేదు. ఆ సంస్కృతి పేరిట వచ్చిన ఉపసంస్కృతిని మాత్రం వ్యతిరేకించాల్సిందే. జల్లికట్టు ఆటను రక్తి కట్టించేందుకు కొంత మంది ఎద్దులకు మద్యం తాగిస్తున్నారని, రక్తం కారేలా ఎద్దుల తోకను తెంపేస్తున్నారని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆటలో జంతువులకన్నా మనుషులే ఎక్కువ గాయపడుతున్నారని అంటున్నవారు కూడా ఉన్నారు. ఎద్దులపై స్వారీ చేసి విజయం సాధించడం కోసం యువకులు ‘టెస్టోస్టెరోన్’ అనే లైంగిక హార్మోన్లను ఎక్కించుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. ఇదేమి సంస్కృతి?... ఈ విపరీత పోకడలను ఉప సంస్కతి అంటాం. జల్లికట్టు ఆటను రక్తి కట్టించడం కోసం పెద్ద మొత్తాల్లో స్పాన్సర్షిప్లు రావడం, ప్రైజ్మనీ భారీగా పెట్టడం ఈ సంస్కతికి దారితీసిందని చెప్పవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జంతు సంక్షేమ విభాగం మార్గదర్శకాల ప్రకారం జంతువుల ఆయురారోగ్యాలను చూసుకోవడం యజమానుల బాధ్యత. వాటిపై ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడరాదు. అంతేకాకుండా వాటిని భయానికి, మానసిక ఒత్తిడికి గురిచేయరాదు. జల్లికట్టు పోటీల్లోకి దించే ఎద్దులను వాటి యజమానులు ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవడమే కాదు. కన్నబిడ్డల్లా కూడా చూసుకుంటున్నారనడంలో సందేహం లేదు. కానీ జల్లికట్టు పోటీలు జరిగే పది రోజులు మాత్రం అవి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. వరి బీజాలను కత్తిరించడం హింస కాదా? ఈ హింసను కూడా సహించలేమని భారత జాతీయ జంతువుల సంక్షేమ బోర్డు, పెటా లాంటి సంస్థలు వాదిస్తున్నాయి. సంతానం కలిగే అవకాశం లేకుండా ఎద్దులు, కుక్కల వరి బీజాలను నాటు పద్ధతిలో నలిపేయడాన్ని ఈ సంస్థలు ఎందుకు సమర్థిస్తున్నాయి. అది జంతువులను హింసించడం కిందకు రాదా? క్షీర విప్లవం పేరిట, డెయిరీల అభివద్ధి పేరిట ఆవులను, బర్రెలను పాలించే యంత్రాలుగా మార్చడం జీవ హింస కాదా? పాలను పీల్చే యంత్రాలు వాటి రక్తాన్ని పీల్చిన సందర్భాలు లేవా? జల్లికట్టును సమర్థిస్తున్నవారు, అటు వ్యతిరేకిస్తున్న వారు సగం సత్యమే మాట్లాడుతున్నారు. మనలో హింసాత్మక ఆనందం... వ్యవసాయ సంస్కృతిలో భాగంగా వచ్చిన జల్లికట్టును రక్తం చిందే ఆటగా మార్చిన ఉపసంస్కృతికి మనషుల్లో ఉండే హింసాత్మక ఆనందం అనే ప్రవత్తి కూడా కారణమే. తమిళ దక్షిణాదిలో విశేషాధరణగల జల్లికట్టుకు కుల వివక్షత కూడా ఎంతో ఉంది. ఈ ఆటలోకి దళితులను అనుమతించరు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంగా కాకుండా మనలోని హింసాత్మక ఆనందానికి దారితీస్తున్నందున, మన మధ్య కుల వివక్షతను పెంచుతున్నందున ఈ జల్లికట్టును నిషేధించవచ్చు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సమస్యకైనా నిషేధం పరిష్కారం కాదు, కాకూడదు. జల్లికట్టు సంస్కృతిని లేదా ఉప సంస్కృతిని ఇంత లోతుగా సుప్రీంకోర్టు కూడా పరిశీలించక పోవడం శోచనీయం. ఉప సంస్కతి నుంచి అసలు సంస్కతి పునరుద్ధరణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, 2009లో జల్లికట్టును క్రమబద్ధీకరిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో సరైనా మార్గదర్శకాలు ఉన్నట్లయినా ఈ వివాదం ఇంతవరకు వచ్చేది కాదు. ‘నాన్ తమిళన్ దా, నాన్ తమిళాచి దా’ అంటూ జల్టికట్టుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న తమిళ సోదరులు, దుర్భర కరవు కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఇలాగే ముందుకు వస్తే అదే అప్పుడు అసలైన సంస్కృతి అవుతుంది. -
అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా?
-
అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా?
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో భారీ ఎత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ మొత్తం ప్రదర్శనకారులతో నిండిపోయింది. ఎవరు పిలుపునిచ్చారో తెలియదు, ఎలా వచ్చారో అర్థం కాలేదు గానీ.. వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. వాళ్లలో ఎక్కువ మంది యువకులు, విద్యావంతులు, యువ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేవు గానీ, నిరసనలు మిన్నంటాయి. ప్రశాంతంగా తమ నిరసన తెలియజేసి, జల్లికట్టుకు అనుమతులు ఇవ్వాలని గళం వినిపించారు. అప్పటివరకు బీచ్ వదిలి వెళ్లేది లేదంటూ రాత్రంతా కూడా అక్కడే పడుకున్నారు. అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలూ జల్లికట్టుకు మద్దతు తెలిపాయి. కానీ ఏ ఒక్కరూ ఈ నిరసనలకు పిలుపు ఇవ్వలేదు, వాటిని స్పాన్సర్ చేయలేదు. విద్యార్థులు, నటీనటులు, క్రికెటర్లు, కొంతమంది సెలబ్రిటీలు ప్రధానంగా దీనికి మద్దతిచ్చారు. ఇదంతా కూడా సోషల్ మీడియా పుణ్యమే. ఫేస్బుక్, వాట్సప్ ద్వారా తమిళ సంస్కృతి అయిన జల్లికట్టును కాపాడుకోవాలంటూ ఇచ్చిన పిలుపు విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. ఈ నిరసనలు కొనసాగుతూనే ఉండే సూచనలు కనిపించడంతో చెన్నైలోని 31 కాలేజీలు ఏకంగా సెలవులు ప్రకటించేశాయి. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తేవాలని కోరనున్నారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళ కూడా అదేమాట చెప్పారు. పెటా మీద నిషేధం విధిస్తామని కూడా ఆమె అన్నారు. ఇతర పార్టీల వాళ్లు కూడా తప్పనిసరిగా దీనికి మద్దతు చెప్పాల్సి వచ్చింది. చెన్నైకి చెందిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్విట్టర్లో జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని చెప్పాడు. ప్రముఖ హీరో విజయ్ కూడా ఒక వీడియో సందేశం పోస్ట్ చేశాడు. ప్రజల సంప్రదాయాలు, వాళ్ల హక్కులను దోచుకోడానికి చట్టాన్ని తయారు చేయలేదని, జల్లికట్టు అనేది ప్రతి ఒక్క తమిళుడి గుర్తింపని చెప్పాడు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవాళ్లంతా తాము తమిళులమనే వచ్చారు తప్ప రాజకీయ ఒత్తిడితో కాదన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు చెప్పారు. తమిళులు ఎద్దులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారని, వాటిని హింసించరని తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు మాత్రం.. ఈ నిరసనల వల్ల ఈ అంశంపై కోర్టులో కొనసాగుతున్న విచారణ మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
తమిళనాట జల్లికట్టు ప్రకంపనలు
-
తమిళనాట జల్లికట్టు ప్రకంపనలు
• నిషేధంపై ఉద్యమిస్తున్న తమిళయువత • రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతున్న ఆందోళనలు • జనసంద్రంగా మారిన మెరీనా తీరం సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మా ప్రాచీన క్రీడపై నిషేధం విధిస్తారా? ఇది తమిళ సంస్కృతిపై దాడి చేయడమే’ అంటూ చెన్నై సాగరతీరాన తమిళయువత శివాలెత్తింది. జల్లికట్టుపై విధించిన నిషేధం ఎత్తేయాలంటూ వేలాది మంది యువకులు మెరీనా బీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీలు, వర్సిటీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి బీచ్కు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సహా అన్ని పార్టీల, కోలివుడ్ మద్దతు తోడవడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ ఆందోళనలు పెరగడంతో తమిళసర్కారు అప్రమత్తమైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు 51 మంది అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి సీఎం పన్నీర్ సెల్వం గురువారం ప్రధానిని కలవనున్నారు. పెటాను నిషేధించాలి.. జల్లికట్టును నిషేధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జంతుహక్కుల సంస్థ పెటాపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఆసంస్థను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలంగనల్లూర్, మధురైలోని తమ్ముక్కం గ్రౌండ్స్లోనూ యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శివగంగ జిల్లాలోని కందిపట్టి గ్రామంలో 100 ఎడ్లతో నిర్వహిస్తున్న మంజు విరాట్టు (ఎద్దులను లొంగదీసుకోవడం) ఉత్సవాన్ని అడ్డుకొని పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు.నటుడు విశాల్, కమెడియన్ వివేక్, శివకార్తికేయన్తో సహా పలువురు జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు. ఈవిషయమై జనవరి 20న ధర్నా చేస్తున్నట్లు దక్షణభారత సినీనటుల సంఘం ప్రకటించింది. జల్లికట్టు ఉద్యమాన్ని విదేశాల్లోని తమిళులు సైతం బలపరుస్తూ ఆందోళనలు చేపట్టారు. అమెరికా, లండన్, సింగపూర్, కెనడా దేశాల్లో వందలాది మంది తమిళులు బుధవారం ఉదయం ఆందోళనలు నిర్వహించారు. జోక్యం చేసుకోం: హైకోర్టు జల్లికట్టును సుప్రీం కోర్టు నిషేధించినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మెరినాబీచ్లో ఆందోళనలను న్యాయవాది కె. బాలు బుధవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మెరీనా బీచ్ ఏమీ ధర్నాస్థలం కాదని పేర్కొన్న కోర్టు, సర్వోన్నత న్యాయస్థానం నిషేధించినందున హైకోర్టుగాని, తమిళనాడు ప్రభుత్వంకాని ఏమీ చేయలేవని తేల్చి చెప్పింది. బీజేపీ జాతీయ కార్యదర్శిపై కేసు: తిరుప్పూరు, మనప్పారై, ఉసిలంపట్టి, శివగంగై జిల్లా సింగంపునరీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అతిక్రమించి జల్లికట్టు నిర్వహించారు. సింగంపునరీలో జల్లికట్టుకు తన కాడెద్దును పంపిన బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళన విరమించండి: సీఎం జల్లికట్టుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతు ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తమిళనాడు సీఎం పన్నీర్సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం ప్రకటించారు. జల్లికట్టు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
మెరీనా బీచ్లో భారీ ఆంధోళన
-
జల్లికట్టు కోసం రగులుతున్న తమిళనాడు
చెన్నై: జల్లికట్టు క్రీడను నిర్వహించుకోవడానికి అనుమతి రాకపోవడంతో తమిళనాడు ప్రజలు రగిలిపోతున్నారు. జల్లికట్టు నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చినప్పటినుంచీ తమిళనాడులో ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. గత కొన్ని రోజులనుంచి యువత చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. చెన్నై మెరీనా తీరానికి వేలాది మంది యువత చేరుకుని మెరీనా తీరాన్ని బ్లాక్ చేశారు. సీఎం పన్నీర్ సెల్వం వచ్చి హామీ ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేలాదిగా యువత మెరీనా తీరానికి చేరుకుని తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో తమిళనాడు సర్కార్ చేతులెత్తేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ‘జల్లికట్టు’ని నిషేధించాలి’’ అని ఇటీవల తన ట్విట్టర్లో త్రిష పేర్కొనడంతో ఆమెపై తమిళ ప్రజలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. హీరో సూర్య మాత్రం జల్లికట్టుకు పూర్తిగా మద్ధతు తెలిపాడు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ సాహస క్రీడ తప్పకుండా ప్రతిఏటా నిర్వహించాల్సిందే అంటూ ఆందోళన చేపట్టిన యువత వెనక్కి తగ్గడం లేదు. మెరీనా తీరాన్ని బ్లాక్ చేసి తమ నిరసన తెలిపారు. (చదవండి: సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు) -
అమ్మ బాటలో..
► అట్టహాసంగా శశికళ తొలి అడుగు ► ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన చిన్నమ్మ ► శశికళను వ్యతిరేకిస్తూ కార్యకర్త ఆత్మహత్యాయత్నం ► డీఎంకేలోకి మాజీ మంత్రి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానాన్ని భర్తీ చేసిన శశికళ అట్టహాసంగా తన తొలి అడుగు వేశారు. నేతలు, కార్యకర్తలు జయ జయ ధ్వానాలు పలుకుతుండగా పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించగా పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా మారి ఒక స్థానాన్ని భర్తీ చేశారు. 29వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో రెండో స్థానం కూడా భర్తీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఆగమేఘాలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి రంగులు వేశారు. పార్టీ ప్రాంగణంలో ఎంజీఆర్ విగ్రహం వద్ద స్టేజీ నిర్మించారు. శుక్రవారం సాయంత్రం సీఎం పన్నీర్సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన కార్యదర్శిగా జయలలిత వినియోగించిన కారులోనే, అమ్మ వలే ముదురు ఆకుపచ్చ చీర ధరించి ఉదయం 12.12 గంటలకు పోయెస్గార్డెన్ నుంచి బయలుదేరారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలు రెండాకుల చిహ్నాన్ని చూపిస్తూ ఆమెకు స్వాగతం పలికారు. కార్యాలయం వద్ద సీఎం పన్నీర్సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూధన్ తదితరులు ఆహ్వానం పలికారు. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి జయతో పాటూ అనేక సార్లు వచ్చిన శశికళ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా అడుగుపెట్టారు. ముందుగా ప్రాంగణంలోని ఎంజీ రామచంద్రన్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి అనంతరం తన చాంబర్లోకి వెళ్లారు. తన చాంబర్లోని ఎంజీఆర్, జయలలితన చిత్రపటాలకు నమస్కరిస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. ఆ తరువాత పార్టీ పేపర్ల సంతకం చేసి బాద్యతలు చేపట్టారు.అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె ఆమె ప్రసంగిస్తూ,మరో వందేళ్లయినా రాష్ట్రాన్ని అన్నాడీఎంకేనే పాలిస్తుంది, ఇందుకు జయలలిత చూపిన మార్గంలో అందరం పయనించాలని అన్నారు. అమ్మ ఫోటోను చూపిస్తూనే ప్రజల్లోకి వెళ్లాలని కోరుతున్నాట్లు చెప్పారు. చారిత్రాత్మకమైన పార్టీకి జయలలిత తరువాత తనను ఎంపిక చేసిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు. తనకు 29 ఏళ్ల వయస్సు నాటి నుండి జయలలితను వెంటనడుస్తున్నానని, ప్రస్తుతం జయలలితకు 62 ఏళ్లుకాగా ఆమెతో తనకు 32 ఏళ్ల అనుబంధమని తెలిపారు. పార్టీ అధినేత్రిగా ఆమె సింహలా గర్జించేవారని చెప్పారు. జయకు తనకంటూ వ్యక్తిగతంగా కోర్కెలు ఏమీ లేవు, ప్రజల కోసమే నిరంతరం పాటుపడేవారని చెప్పారు. ఆమె చూపిన మార్గంలోనే తన పయనం సాగుతుందని తెలిపారు. ఒకటిన్న కోట్ల కార్యకర్తల భవిష్యత్తును నీకు అప్పగిస్తునానని జయ చెబుతున్నట్లు భావన కలుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మదిలోని లక్ష్య సాధనకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని చెప్పారు. జయకు ఇచ్చిన సహకారాన్ని తనకు కూడా ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఎంజీఆర్ వందేళ్ల జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని జయ అనేకసార్లు చెప్పేవారని తెలిపారు. నేడు అమ్మ లేకున్నా ఎంజీఆర్ జయంతిని ఆమె ఆశించినట్లుగా నిర్వహించేందుకు శ్రేణులు సన్నద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఎంజీఆర్ వందేళ్ల జయంతిని పురస్కరించుకుని ఆయన బొమ్మతో రూపాయి నాణం, పోస్టల్ స్టాంపు వెలువడేలా కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. కార్యకర్త ఆత్మహత్యాయత్నం:ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను నిరసిస్తూ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా స్వాతి అనంద్ (42) అనే కార్యకర్త మెరీనాబీచ్లోని అమ్మ సమాధి వద్ద కు చేరుకుని శశికళ పట్ల వ్యతిరేక నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా విషం తాగాడు. స్పృహకోల్పోయిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా, శశికళ నియామకం పట్ల అసంతృప్తి ప్రకటిస్తూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నాంజిల్ సంపత్ సొంత పార్టీని వీడి డీఎంకేలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన సహచరులకు ఆయన ఉత్తరాలు రాశారు. -
గుండెల్లో అమ్మ
► అమ్మ సమాధి వద్ద అశ్రుతర్పణాలు ►గుండు కొట్టించుకున్న 60 మంది అభిమానులు ►66కు పెరిగిన మృతుల సంఖ్య అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్లిన వాస్తవాన్ని తమిళనాడు ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. బుధవారం నాటికి అమ్మ లేదనే ఆవేదనతో మొత్తం 66 గుండెలు ఆగిపోయారుు. లక్షలాది మంది ప్రజలు బుధవారం మెరీనాబీచ్లోని అమ్మ సమాధిని కనులారా చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: స్వల్ప అస్వస్థత మాత్రమే అంటూ సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అరుున అమ్మ ఈనెల 5వ తేదీన ప్రాణం కోల్పోరుున స్థితిలోనే బైటకు వచ్చారు. ఇదిగో డిశ్చార్జ్...అదిగో ఇంటికి వెళతారు అంటూ ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ జయలలిత శాశ్వతంగా కన్నుమూసారు. అమ్మను కడసారి చూసుకోవాలనే తలపంపుతో ఈనెల 6వ తేదీన జరిగిన అంతిమ సంస్కారానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ఉన్న జనం మధ్య అమ్మ పార్దివదేహం ఊరేగింపుగా మెరీనా బీచ్ తీరంతోని ఎంజీఆర్ సమాధి వద్దకు చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ దృశ్యాలను కొందరు ప్రత్యక్షంగా చూసి కన్నీరుపెట్టగా, మరికొందరు టీవీల్లో వీక్షిస్తూ విలపించారు. అమ్మ లేదనే ఆవేదన మిన్నంటగా మెరీనా బీచ్ తీరం బుధవారం సైతం కన్నీటి సంద్రంగా మారిపోరుుంది. భారీ పోలీసు బందోబస్తు వల్ల అంత్యక్రియల సమయంలో ఆమె ఖనన దృశ్యాలను దగ్గరగా చూడలేక పోరుున వేలాది మంది ప్రజలు మంగళవారం రాత్రి నగరంలోనే ఉండిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మను ఖననం చేసిన చోటును దగ్గరగా తిలకించేందుకు ఎంజీఆర్ సమాధి వద్ద క్యూ కట్టారు. అమ్మకు బుధవారం సైతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయా అని భావించే స్థారుులో మెరీనాబీచ్ రోడ్డు జనసంద్రంగా మారిపోరుుంది. వేలాది మంది కార్లు, ద్విచక్రవాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది చెన్నైకి వచ్చారు. బుధవారం సైతం ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించని పోలీసులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. అమ్మ సమాధి చుట్టూ బ్యారికేడ్లను అమర్చి క్యూలైన్లను ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జయలలిత సమాధిని ప్రజల సందర్శించుకుని శ్రద్దాంజలి ఘటించారు. కొందరు అభిమానులు అమ్మ సమాధి వద్ద కూలబడి గుక్కపట్టి విలపించారు. మరో మహిళ అమ్మ సమాధి చూడగానే సృ్పహతప్పి పడిపోగా 108 అంబులెన్సలో ఆసుపత్రికి తరలించారు. గుండుకొట్టించుకుని నివాళి : ఇదిలా ఉండగా, అండిపట్టి అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగ తమిళ్సెల్వన్ నాయకత్వంలో 60 మంది పార్టీ కార్యకర్తలు బుధవారం అమ్మ సమాధి వద్ద గుండుకొట్టించుకుని నివాళులర్పించారు. జయలలిత తమను కన్నతల్లిలా ఆదరించింది, అందుకే కన్నతల్లి ఎలా చేస్తామో అలా ఈ అమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మరో అభిమాని తెలిపాడు. ఇలా గుండు కొట్టించుకున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. పోచంపల్లిలో అమ్మకు అంత్యక్రియలు : జయలలితపై తమకు అభిమానాన్ని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి ప్రజలు ప్రత్యేకంగా చాటుకున్నారు. బంకమట్టితో అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను తయారు చేసి పాడెపై ఊరేగించి ఖనన సంస్కారాలు చేయడం చూపరులను కంటతడిపెట్టించింది. స్మారక మండపం ఏర్పాట్లు : ఇదిలా ఉండగా, అమ్మను ఖననం చేసిన చోట స్మారక మండపం నిర్మించేందుకు బుధవారం ఏర్పాట్లు ప్రారంభమైనారుు. జయలలిత జీవితంలోని విశేషాలు, ప్రవేశపెట్టిన పధకాలు, ఆమె వినియోగించిన వస్తువులు ఇలా అనేక ఆకర్షణీయమైన అంశాలతో స్మారక మండపాన్ని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. 66కు పెరిగిన మృతుల సంఖ్య : అమ్మ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 66 కు చేరుకుంది. మంగళవారం సాయంత్రానికి 61 మంది చనిపోగా బుధవారం మరో ఐదు మంది ప్రాణాలు విడిచారు. -
మెరీనా బీచ్లో అమ్మకు నివాళులు
-
జయలలిత అంతిమ యాత్ర సాగింది ఇలా..
చెన్నై: అభిమానులు, సన్నిహితులు, వివిధ పార్టీల నేతల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నై మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో జయ రాజకీయ గురువు ఎంజీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయ నెచ్చెలి శశికళ నటరాజన్ తన ప్రాణ స్నేహితురాలికి అశ్రునయనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి తుది వీడ్కోలు పలికింది. అమ్మ అంత్యక్రియలను చూసేందుకు, తుది వీడ్కోలు పలికేందుకు పార్టీ నేతలు, అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. 5:10 - శశికళతో కలిసి జయలలిత అంతిమయాత్రలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ 5:14 - చెపాక్ స్టేడియానికి చేరుకున్న జయ అంతిమయాత్ర. అక్కడి నుంచి బీచ్ రోడ్డు వైపునకు కొనసాగుతున్న కార్యక్రమం 5:19 - ఎంజీఆర్ స్మారకవనానికి చేరుకున్న వైకో 5:22 - చెన్నైలోని మెరీనా బీచ్కు చేరిన అమ్మ అంతిమ యాత్ర 5:32 - మెరీనా బీచ్ లోని ఎంజీఆర్ స్మారక వనానికి జయ భౌతికకాయం 5:35 - అంతిమ సంస్కారాలు జరిపే చోటుకు చేరిన జయలలిత భౌతికకాయం 5:37 - అంత్యక్రియలు నిర్వహించే స్థలానికి చేరిన జయ శవపేటిక 5:39 - శవపేటిక నుంచి 'అమ్మ' భౌతికకాయాన్ని బయటకు తీశారు 5:44 - జయ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు 5:46 - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సీఎం జయలలిత అంతిమ సంస్కారాల కార్యక్రమాలు ప్రారంభం 5:48 - అమ్మ వీర విధేయుడు ఓ పన్నీర్ సెల్వంతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాధాక్రిష్ణన్ జయలలితకు అంతిమ నివాళి 5:51 - తంబిదురై, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య, ఇతర కీలక నేతలు జయకు నివాళులు 5:53 - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు జయకు నివాళులర్పించిన ఆ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్ 5:53 - అన్నాడీఎంకే నేత జయకు అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రదేశం వద్ద కూర్చున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులు 5:54 - ఓ పూజారి జయ భౌతికకాయం వద్దకు వచ్చి కార్యక్రమం నిర్వహించారు. 5:56 - జయలలిత భౌతికకాయంపై ఉన్న జాతీయ పతాకాన్ని శశికళకు అప్పగింత. సాధారణంగా కుటుంసభ్యులకు ఇలా అందజేయడం ఆనవాయితీ 5:57 - మరో వ్యక్తితో కలిసి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న నెచ్చెలి శశికళ 6:02 - సందర్శనార్థం జయలలిత భౌతికకాయాన్ని ఉంచిన చందనపు శవపేటికను మూసివేత. జయ కడసారి చూపు ఇంతటితో ముగిసింది. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేసిన జయ నెచ్చెలి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
జయకు శశికళ అంతిమ సంస్కారాలు
-
జయకు శశికళ అంతిమ సంస్కారాలు
చెన్నై: అభిమానులు, మద్దతుదారులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని ఎమ్జీఆర్ స్మారక వనంలో ‘పురచ్చి తలైవీ’కి కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ నటరాజన్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. జయలలిత మేనల్లుడు ఆమె పక్కనే ఉన్నారు. చందనపు పేటికలో జయ పార్థీవ దేహాన్ని ఉంచి ఖననం చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ఎమ్జీఆర్ సమాధికి 20 మీటర్ల దూరంలో జయలలిత భౌతికకాయాన్ని పాతిపెట్టారు. ‘అమ్మ’ అంత్యక్రియలకు నాయకులు, ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రజలందరూ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అనువుగా పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాథాకృష్ణన్, గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం పన్నీరు సెల్వం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, మాజీ గవర్నర్ రోశయ్య, తదితర ప్రముఖులు చివరిసారిగా ‘అమ్మ’కు వీడ్కోలు పలికారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]