కామరాజు భూకబ్జాపై సుప్రీంకోర్టు సీరియస్‌ | supreme court serious on minister kamaraj issue | Sakshi
Sakshi News home page

కామరాజు భూకబ్జాపై సుప్రీంకోర్టు సీరియస్‌

May 3 2017 12:18 PM | Updated on Sep 2 2018 5:24 PM

తమిళనాడు మంత్రి కామరాజు భూకబ్జా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమిళనాడు: తమిళనాడు మంత్రి కామరాజు భూకబ్జా వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో పోలీసుల అలసత్వంపై కోర్టు మండిపడింది.

చట్టంకంటే మంత్రి ఎక్కువా అని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిలదీసింది. ఈ ఘటనపై సోమవారంలోగా సమగ్ర నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. భూవివాదంలో తన వద్ద డబ్బు తీసుకున్నాడని తిరువరుర్‌కు చెందిన ఎస్‌వీఎస్‌ కుమార్‌ అనే వ్యక్తి మంత్రిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement