విజయకాంత్ కేసు విచారణ వాయిదా | Postponed in Vijayakanth case | Sakshi
Sakshi News home page

విజయకాంత్ కేసు విచారణ వాయిదా

Dec 22 2013 2:01 AM | Updated on Sep 2 2017 1:50 AM

విజయకాంత్‌పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. తంజావూరులో 2012 ఆగస్టు 10వ తేదీ జరిగిన డీఎండీకే బహిరంగ

 టీ.నగర్, న్యూస్‌లైన్: విజయకాంత్‌పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. తంజావూరులో 2012 ఆగస్టు 10వ తేదీ జరిగిన డీఎండీకే బహిరంగ సభలో మాట్లాడిన విజయకాంత్ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తంజావూరు జిల్లా కోర్టులో పిటషన్ దాఖలైంది. కపి స్థలంలో గత ఏప్రిల్ 4వ తేదీ జరిగిన డీఎండీకే బహిరంగ సభలో ఎమ్మెల్యే పార్థసారథి, ముఖ్యమంత్రికి పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్ దాఖలైంది. ఈ రెండు కేసులు తంజావూరు కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చాయి. ఈ కేసులో హాజరయ్యేందుకు విజయకాంత్ హైకోర్టులో మినహాయింపు పొం దారు. దీంతో కేసుల విచారణను ఫిబ్రవరి మూడవ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement