గద్వాలపై కక్షగట్టిన కేసీఆర్: డీకే అరుణ | KCR deliberately ignoring demand for separate district with Gadwal: DK Aruna | Sakshi
Sakshi News home page

గద్వాలపై కక్షగట్టిన కేసీఆర్: డీకే అరుణ

Sep 7 2016 1:41 PM | Updated on Sep 4 2017 12:33 PM

గద్వాలపై కక్షగట్టిన కేసీఆర్: డీకే అరుణ

గద్వాలపై కక్షగట్టిన కేసీఆర్: డీకే అరుణ

గద్వాలపై సీఎం కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు.

హైదరాబాద్: గద్వాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు.

ప్రజల సెంటిమెంట్ ను గౌరవించి గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. గద్వాలను జిల్లా చేయాలని ఒకే వ్యక్తి నుంచి వేల సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయన్న ఆరోపణలను ఆమె ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement