టిబెటన్ అప్రైసింగ్ డే సందర్భంగా వేలాది మంది శరణార్థులు చైనీస్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేశారు.
న్యూఢిల్లీ:టిబెటన్ అప్రైసింగ్ డే సందర్భంగా వేలాది మంది శరణార్థులు చైనీస్ రాయబార కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేశారు. టిబెటన్ జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో చేతపట్టుకొని ఎంబసీ ఎదుట ‘ఫ్రీ టిబెట్’ నినాదాలు చేశారు. మరి కొందరు నల్ల మాస్కులను మొహాలకు కట్టుకొని, రంగులు పూసుకుని నిరసన తెలిపారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలి పెట్టారు.


