సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం కసక్కోడుకు చెందిన ఉమానాథ్ స్వాతంత్య్ర సమరయోధుడు, వామపక్ష వాది. స్వాతంత్య్ర సంగ్రామంలో తొమ్మిదేళ్లు జైలు జీవితాన్ని సైతం ఆయన అనుభవించారు. రాష్ట్రంలోనే కాదు, జాతీ య స్థాయిలోని సీపీఎం నేతల్లో సీనియర్గా ఉన్న ఉమానాథ్ రెండు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించారు. తమిళనాడులో స్థిర పడ్డ ఆయనకు ముగ్గురు పిల్లలు. భార్య పాపమ్మ రెండేళ్ల క్రితం మరణించారు. ఈమె ఐద్వా నాయకురాలు, ఆమె కూడా ఓ మారు అ సెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒక కుమార్తె లక్ష్మి కూడా ఇటీవల మృతి చెందారు. వామ పక్ష నేతగా, కార్మిక పక్షపాతిగా అందరి మదిలో ఉమానాథ్ చెరగని ముద్ర వేసుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. సీపీఎం జాతీయ కమిటీ సభ్యుడిగా తన సేవలను అందిస్తూ వచ్చిన ఉమానాథ్ కొంతకాలంగా వయోభారం, అనారోగ్య స మస్యతో బాధ పడుతున్నారు.
రెండు సార్లు పుదుకోట్టై నుంచి పార్లమెంట్కు, మరో రెం డు సార్లు నాగపట్నం నుంచి అసెంబ్లీకి ఆయన ఎన్నికైనా సొంతం గా ఓ ఇల్లు అం టూ లేదు. కుమార్తెలను మాత్రం ప్రయోజకులను చేశారు. ఓ కుమార్తె నిర్మల రాణి న్యాయవాదిగా వ్యవహరిస్తుండగా, మరో కుమార్తె వాసుకీ తండ్రి బాటలో నడిచారు. రాష్ట్ర పార్టీలో, మహిళా విభాగం ఐద్వాలో వాసుకీ తన సేవలందిస్తున్నారు.
అనారోగ్యం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా తిరుచ్చి తిల్లై నగర్లోని కుమార్తె నిర్మల ఇంట్లో ఉం టూ వైద్య సేవలు పొందారు. పరిస్థితి విషమించడంతో గత వారం అక్కడే ఓ ఆస్పత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితం సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ తిరు చ్చి వచ్చి మరీ ఉమానాథ్ను పరామర్శించి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ చ్చిన కామ్రేడ్ ఉమానాథ్ బుధవారం ఉద యం తుది శ్వాస విడిచారు.
ఆయన మరణ సమాచారంతో సీపీఎం వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. సరిగ్గా 7.15 గంటలకు ఉ మానాథ్ మరణించినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్ ప్రకటించారు. నివాళులు: ఉమానాథ్ భౌతిక కాయాన్ని కరూర్ బైపాస్ రోడ్డులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఉంచారు. సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఇక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని వయ్యామరి శ్మశాన వాటికకు తరలించనున్నారు. అక్కడ పది గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమానాథ్ మృతి సీపీఎంకు తీరని లోటు అని రాజకీయ పక్షాల నాయకులు పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఎండీఎంకే నేత వైగో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తమ సానుభూతిని తెలియజేశారు.
కామ్రేడ్ ‘ఉమానాథ్’అస్తమయం.!
Published Wed, May 21 2014 11:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement