ఈ-రిక్షాలపై నిషేధం 20 వరకు | E-rickshaw ban: Hearing of review petition adjourned till 20 August | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షాలపై నిషేధం 20 వరకు

Aug 14 2014 10:43 PM | Updated on Sep 2 2017 11:52 AM

నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేసుపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై నిషేధం ఈ నెల 20 వరకు కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కేసుపై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 15 వరకు ఈ-రిక్షాలను నడిపేందుకు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేస్తామంటూ కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ సమర్పించిన ప్రతిపాదనను న్యాయమూర్తులు బి.డి.అహ్మద్, , సిద్దార్ధ్ మృదుల్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించనుంది. ఈ-రిక్షాలపై విధిం చిన నిషేధంఎత్తివేతకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ-రిక్షాలపై నిషేధం వల్ల లక్షలమంది జీవనోపాధికి సమస్యను ఎదుర్కొంటున్నారని, అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నిషేధాన్ని ఎత్తివేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ న్యాయస్థానాన్ని కోరారు.
 
 అయితే న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ ప్రతిపాదనను అఫిడవిట్‌తో  సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయస్థానం సూచన మేరకు నిబంధనలకు లోబడి నడుచుకుంటున్న ఈ-రిక్షా చోదకులకు కమర్షియల్ డ్రైవింగ్ లెసైన్సు ఇవ్వడం కోసం రవాణా విభాగం నగరమంతటా  కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ-రిక్షా ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన లేదా ప్రాణపాయం సంభవించిన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కోసం  ఈ-రిక్షా సంఘాలు రూ.10 లక్షల  బీమా నిధిని ఏర్పాటు చేస్తాయని కూడా పేర్కొ ంది. ఈ-రిక్షా దుర్ఘటనల్లో తీవ్రంగా గాయపడినవారికి రూ. 25 వేలు, మృతుల బంధువులకు రూ. లక్షను నష్టపరిహారం కింద చెల్లించనున్నట్లు తెలిపింది. గుర్తింపు చిహ్నాలు, స్టిక్కర్లను కూడా జారీ చేస్తుందని పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement