వేములవాడకు పోటెత్తిన భక్తులు | devotees rush in vemulawada | Sakshi
Sakshi News home page

వేములవాడకు పోటెత్తిన భక్తులు

Apr 5 2017 12:37 PM | Updated on Sep 5 2017 8:01 AM

వేములవాడ‍ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.

రాజన్న సిరిసిల్ల: వేములవాడ‍ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామ నవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారి కళ్యాణం తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది తరలిరావడంతో.. అధికారులు చేసిన ఏర్పాట్లు సరిపోక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసౌకర్యాలకు తోడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. క్యూలైన్లలో నిల్చున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement