పీఎస్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం | couples suicide attempt at excise police station in kurnool | Sakshi
Sakshi News home page

పీఎస్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 21 2016 12:28 PM | Updated on Jul 10 2019 8:02 PM

అకారణంగా తమపై కేసులు బనాయించారని ఓ గిరిజన జంట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆలూరు: అకారణంగా తమపై కేసులు బనాయించారని ఓ గిరిజన జంట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంగటన కర్నూలు జిల్లా ఆలూరులోని ఎక్సైజ్‌స్టేషన్ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది. మండల పరిధిలో నివాసముండే రెడ్యానాయక్ అనే గిరిజనుడు సారా తయారు చేస్తున్నాడనే నెపంతో.. ఈ నెల 8న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పలుమార్లు తాను సారా తయారు చేయలేదని మొరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురై ఈ రోజు ఉదయం భార్యతో కలిసి ఆలూరులోని ఎక్సైజ్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడానికి యత్నించారు. గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకొని కౌన్సెలింగ్ నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement