కబాలి కోసం ఐటీ కొత్త ఒరవడి | Chennai, Bengaluru companies declare a holiday on July 22 | Sakshi
Sakshi News home page

కబాలి కోసం ఐటీ కొత్త ఒరవడి

Jul 20 2016 2:49 AM | Updated on Sep 27 2018 3:58 PM

కబాలి కోసం ఐటీ కొత్త ఒరవడి - Sakshi

కబాలి కోసం ఐటీ కొత్త ఒరవడి

ప్రపంచవ్యాప్తంగా కబాలి గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి

 తమిళసినిమా: ప్రపంచవ్యాప్తంగా కబాలి గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. అంచనాలు తారా స్థాయికి చేరిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి సాధారణ ప్రేక్షకుడి నుంచి సంపన్న కుటుంబాలకు వరకూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా కబాలి చిత్రం చూడటానికి కొత్త విధానాలు అమలులోకి తీసుకురావడం విశేషం.
 
  ఐటీ సంస్థలు కబాలి చిత్ర టిక్కెట్లను పెద్ద మొత్తంలో కొనుకోలు చేయడంతో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు పూర్తిగా విక్రయం జరగ డం విశేషం. తాజాగా ఐటీ రంగంలో పనిచేసేవారు పనికి బంకు కొట్టి కబాలి చిత్రాన్ని చూడటాన్ని ఆపడానికి సంస్థ నిర్వాహకులే ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులకు చిత్రం చూడడానికి షిఫ్ట్‌ల వారీగా టికెట్‌లను ఇచ్చి నూతన విధానానికి తెరలే పడం విశేషం. ఇందుకోసం ఉద్యోగుల జీతాల్లో రూ. 1000 రూపాయలను తీసుకుంటున్నారు.
 
  పలు ప్రైవేట్ రంగ సంస్థలూ కబాలి చిత్ర విడుదల రోజైన22న తమ కార్యాలయాలకు సెలవు ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా స్థానిక రాధాక్రిష్ణన్ రోడ్డులోని ఒక సినీమాల్‌లో ఓ వ్యక్తి ఒక షోకి మొత్తం టిక్కెట్లను కొనుగోలు చేసి వాటిని బ్లాక్‌లో టికె ట్‌ను రూ.1000 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా కబాలి విడుదలకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోందన్న మాట. కబాలిడా..నెరుప్పుడా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement