నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం వల్లభాపురంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.
పిచ్చికుక్కల స్వైర విహారం: 25 గొర్రెలు మృతి
Feb 7 2017 11:30 AM | Updated on Aug 29 2018 4:18 PM
నల్గొండ: నల్గొండ జిల్లాలోని నకిరేకల్ మండలం వల్లభాపురంలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంగళవారం పిచ్చి కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుక్కలు కరవడంతో దాదాపు 25 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మృతితో వాటి యజమానులు తమ ఉపాధికి ఆధారం కోల్పోయామని విలపిస్తున్నారు. పిచ్చికుక్కలను నిర్మూలించి తమకు రక్షణ కల్పించాలని పశువుల యజమానులు, ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement